NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / IAF: 'శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలి'.. శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IAF: 'శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలి'.. శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు 
    శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు

    IAF: 'శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలి'.. శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 10, 2025
    11:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    1984లో భారత వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తొలిసారిగా అంతరిక్షంలో అడుగుపెట్టిన నాలుగు దశాబ్దాల తర్వాత,ఇప్పుడు మరో భారతీయుడు అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నాడు.

    యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామిగా ఎంపికైన శుభాంశు శుక్లా రోదసి ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. .

    బుధవారం సాయంత్రం 5:30కి (భారత కాలమానం ప్రకారం) ఆయన ప్రయాణం ప్రారంభం కానుంది.

    ఈ నేపథ్యంలో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వీడియో కాల్ ద్వారా శుభాంశుతో వీడియో కాల్‌లో మాట్లాడారు.

    ఈ అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా,సురక్షితంగా పూర్తవాలని ఆకాంక్షించారు.

    శుభాంశు భారత అంతరిక్షచరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనే ఆశను వ్యక్తం చేశారు.

    వివరాలు 

    ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణం ప్రతికూలం

    వారి ఈ సంభాషణను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. శుభాంశుతోపాటు అతడి బృందానికి కూడా శుభాకాంక్షలు తెలియజేసింది.

    యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా మిగిలిన ముగ్గురు అంతరిక్షయాత్రికులతో కలిసి స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందించిన డ్రాగన్ వ్యోమనౌకలో రోదసికి పయనించనున్నారు.

    అసలు ప్రయోగం మంగళవారం జరగాల్సి ఉండగా, ప్రయోగ కేంద్రంగా ఉన్న అమెరికా ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దాన్ని బుధవారానికి వాయిదా వేశారు.

    అవసరమైతే ప్రత్యామ్నాయంగా గురువారం సాయంత్రం 5:07కి ప్రయోగం జరగవచ్చని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది.

    వివరాలు 

    శాస్త్రీయ ప్రయోగాలు

    ఈ వ్యోమనౌక భూమిని విడిచిన 28 గంటల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)తో అనుసంధానం కానుంది.

    శుభాంశు బృందం అక్కడ 14 రోజుల పాటు ఉంటూ, శూన్య గరవేతన పరిస్థితుల్లో అనేక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు.

    అంతేకాక, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ఆన్‌లైన్‌ ద్వారా సంభాషించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

    తాజా

    IAF: 'శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలి'.. శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు తగ్గుముఖం.. వెండి ధరలు నిలకడగా! బంగారం
    Apple: ఆపిల్‌ ఎక్స్‌కోడ్‌కు చాట్‌జీపీటీ అనుసంధానం..! ఆపిల్
    Manchu Vishnu: భక్తితో తీసిన సినిమా.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. కన్నప్ప వివాదంపై మంచు విష్ణు క్లారిటీ! కన్నప్ప

    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

    ISS astronauts: అంతరిక్షంలో పేలిన రష్యా ఉపగ్రహం.. ఆశ్రయం పొందిన ISS వ్యోమగాములు  టెక్నాలజీ
    Starliner: ఆగష్టు నాటికి భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్ .. అంతరిక్ష నౌకకు మరమ్మతులు చేస్తున్న నాసా  టెక్నాలజీ
    ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామి ఎవరు? టెక్నాలజీ
    NASA: ఐఎస్ఎస్‌లో నిలిచిపోయిన NASA-SpaceX Crew-8 మిషన్‌.. కారణమిదే!  నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025