
Air india Flight Crash: అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానం.. విమానంలో 242 మంది ప్రయాణికులు
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం లండన్కు బయల్దేరిన ఏఐ-171విమానం దుర్ఘటనకు గురైంది.
ఈవిమానంలో ప్రయాణిస్తున్న మొత్తం ప్రయాణికుల సంఖ్య 242.రన్వేపై నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది.
మేఘాణినగర్లోని ఘోడాసర్ క్యాంప్ ప్రాంతానికి సమీపంలో ఈ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది.
ఘటనజరిగిన వెంటనే ఆ ప్రాంతం నల్లటి పొగతో నిండిపోయింది.మధ్యాహ్నం సుమారు 1.39 గంటల సమయంలో విమానం ఒక చెట్టును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మొదటికి లభించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.
ఆసమయంలో విమానం భూమి నుండి సుమారు 825అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది.
దుర్ఘటనకు గురైన విమానం బోయింగ్ 787డ్రీమ్లైనర్ మోడల్కు చెందిన విస్తృత శరీర నిర్మాణం కలిగిన జెట్.
వివరాలు
విమానంలో మాజీ సీఎం
దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు.ఈ విమానం సుదూర ప్రయాణం కావడం వల్ల అందులో ఇంధన పరిమాణం ఎక్కువగా ఉండటంతో కూలిన సమయంలో భయంకరమైన పేలుడు సంభవించింది.
వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించారు.
ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రయాణిస్తున్నారని ఏబీపీ వార్తా సంస్థ పేర్కొంది.
ఈ ఘటన తీవ్రత తెలుసుకున్న వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఘటనాస్థలానికి బయల్దేరారు.
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.