
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. పలు విమానాశ్రయాలు మూసివేత..విమానాల రాకపోకలకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
మే 7న తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో భారత వైమానిక దళం పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించాయి.
ఈ దాడుల్లో భారత సైన్యం పాకిస్తాన్తో పాటు, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) ప్రాంతాల్లోకి చొరబడి 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది.
ఈ ఆపరేషన్ ప్రధానంగా పాకిస్తాన్, పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ దాడి నేపథ్యం 2025 ఏప్రిల్ 22 మంగళవారం నాడు జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి.
ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రతిస్పందనగానే భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్'ను అమలులోకి తీసుకొచ్చింది.
వివరాలు
దేశవ్యాప్తంగా విమానయాన కార్యకలాపాలపై ప్రభావం
ఆపరేషన్ సిందూర్ కింద,భారత వైమానిక దళం జైష్-ఎ-మొహమ్మద్,లష్కరే-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది.
ఈ దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానయాన కార్యకలాపాలపై ప్రభావం కనిపించింది.
ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు అత్యవసర హెచ్చరికను జారీ చేసింది.ఈ హెచ్చరిక ప్రకారం మే 7న మధ్యాహ్నం 12 గంటల వరకు దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా విమానాలన్నీ రద్దయ్యాయి.
ఇండిగో, స్పైస్ జెట్ వంటి ఇతర ప్రైవేట్ ఎయిర్లైన్స్ కూడా తమ విమానాల షెడ్యూల్లను రద్దు చేశాయి.
ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాలు తదుపరి ప్రకటన వచ్చే వరకూ మూసివేయబడినట్టు ప్రకటించాయి.
వివరాలు
అనేక నగరాలకు విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేత
పాక్, పీఓకేలో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు తమ ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చాయి.
ఈ సంస్థలు సోషల్ మీడియాలో పోస్ట్ల ద్వారా ప్రయాణికులకు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ అధికారిక వెబ్సైట్లు లేదా కస్టమర్ కేర్ ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశాయి.
ఈ కారణంగా బికనీర్,శ్రీనగర్,జమ్మూ, అమృత్సర్,లేహ్,చండీగఢ్,ధర్మశాల వంటి అనేక నగరాలకు విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
ఇదే సమయంలో,ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ (LOC)వెంబడి భారత సైన్యం భారీ షెల్లింగ్ను కూడా చేపట్టింది.
ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ పెట్టే క్రమంలో ఈ ఆపరేషన్ మిలటరీ వ్యూహ పరంగా కీలక ఘట్టంగా భావించబడుతోంది.