NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. పలు విమానాశ్రయాలు మూసివేత..విమానాల రాకపోకలకు అంతరాయం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. పలు విమానాశ్రయాలు మూసివేత..విమానాల రాకపోకలకు అంతరాయం 
    ఆపరేషన్ సింధూర్.. పలు విమానాశ్రయాలు మూసివేత..విమానాల రాకపోకలకు అంతరాయం

    Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. పలు విమానాశ్రయాలు మూసివేత..విమానాల రాకపోకలకు అంతరాయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    08:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మే 7న తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో భారత వైమానిక దళం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించాయి.

    ఈ దాడుల్లో భారత సైన్యం పాకిస్తాన్‌తో పాటు, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) ప్రాంతాల్లోకి చొరబడి 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది.

    ఈ ఆపరేషన్ ప్రధానంగా పాకిస్తాన్, పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

    ఈ దాడి నేపథ్యం 2025 ఏప్రిల్ 22 మంగళవారం నాడు జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి.

    ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రతిస్పందనగానే భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్'ను అమలులోకి తీసుకొచ్చింది.

    వివరాలు 

    దేశవ్యాప్తంగా విమానయాన కార్యకలాపాలపై ప్రభావం

    ఆపరేషన్ సిందూర్ కింద,భారత వైమానిక దళం జైష్-ఎ-మొహమ్మద్,లష్కరే-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది.

    ఈ దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానయాన కార్యకలాపాలపై ప్రభావం కనిపించింది.

    ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు అత్యవసర హెచ్చరికను జారీ చేసింది.ఈ హెచ్చరిక ప్రకారం మే 7న మధ్యాహ్నం 12 గంటల వరకు దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా విమానాలన్నీ రద్దయ్యాయి.

    ఇండిగో, స్పైస్ జెట్ వంటి ఇతర ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ కూడా తమ విమానాల షెడ్యూల్‌లను రద్దు చేశాయి.

    ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాలు తదుపరి ప్రకటన వచ్చే వరకూ మూసివేయబడినట్టు ప్రకటించాయి.

    వివరాలు 

    అనేక నగరాలకు విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేత 

    పాక్, పీఓకేలో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు తమ ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చాయి.

    ఈ సంస్థలు సోషల్ మీడియాలో పోస్ట్‌ల ద్వారా ప్రయాణికులకు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ అధికారిక వెబ్‌సైట్‌లు లేదా కస్టమర్ కేర్ ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశాయి.

    ఈ కారణంగా బికనీర్,శ్రీనగర్,జమ్మూ, అమృత్‌సర్,లేహ్,చండీగఢ్,ధర్మశాల వంటి అనేక నగరాలకు విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.

    ఇదే సమయంలో,ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LOC)వెంబడి భారత సైన్యం భారీ షెల్లింగ్‌ను కూడా చేపట్టింది.

    ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ పెట్టే క్రమంలో ఈ ఆపరేషన్ మిలటరీ వ్యూహ పరంగా కీలక ఘట్టంగా భావించబడుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానం

    తాజా

    Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన అమెరికా
    Monsoon: నేడు కేరళలోకి రుతుపవనాల ప్రవేశం.. దేశవ్యాప్తంగా వర్ష సూచన నైరుతి రుతుపవనాలు
    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే హైదరాబాద్
    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్

    విమానం

    Boeing 737: బోయింగ్‌ విమానాల్లో కీలకమైన రడ్డర్‌ వ్యవస్థలు మోరాయిస్తున్నాయి: డీజీసీఏ హెచ్చరికలు  బోయింగ్
    Turkish Airlines: విమానం నడుపుతుండగా పైలట్ మృతి.. అత్యవసరంగా ల్యాండింగ్‌. న్యూయార్క్
    Boeing: సమ్మె ప్రభావం.. బోయింగ్‌ సంస్థలో 17వేల ఉద్యోగాలపై వేటు బోయింగ్
    Bomb Threat: 48 గంటలలోపు 10 విమానాలకు బాంబు బెదిరింపు.. దర్యాప్తునకు ఏవియేషన్ బాడీ ఆదేశం  బాంబు బెదిరింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025