NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mallikarjun Kharge: ఖర్గే ట్రస్టుకు భూ కేటాయింపు.. కర్ణాటకలో మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్
    తదుపరి వార్తా కథనం
    Mallikarjun Kharge: ఖర్గే ట్రస్టుకు భూ కేటాయింపు.. కర్ణాటకలో మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్

    Mallikarjun Kharge: ఖర్గే ట్రస్టుకు భూ కేటాయింపు.. కర్ణాటకలో మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 27, 2024
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య "ముడా స్కామ్" విషయంలో ఇప్పటికే పెద్ద తలనొప్పిగా మారిన సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.

    బెంగళూరు సమీపంలోని ఓ ఏరోస్పేస్ పార్క్‌లో ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు 5 ఎకరాల భూమి కేటాయించడంపై పెద్ద దుమారం చెలరేగుతోంది.

    కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే ఛైర్మన్‌గా ఉన్న ఈ ట్రస్టుకు కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు భూ కేటాయింపును అప్రజాస్వామిక చర్యగా అభివర్ణిస్తూ

    బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయ ఖర్గేను ప్రశ్నించారు.

    Details

    కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది

    ఈ కేటాయింపు అధికార దుర్వినియోగానికి నిదర్శనమని, కాంగ్రెస్ ప్రభుత్వ బంధుప్రీతి ధోరణికి మరో ఉదాహరణగా నిలుస్తుందని ఆయన ఆరోపణలు చేశారు.

    ఈ వివాదాస్పద భూ కేటాయింపు హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్ కోసం కేటాయించిన 45.94 ఎకరాల భూమిలో భాగమన్నారు.

    ఇది ఎస్సీ కోటా కింద ఖర్గే కుటుంబ ట్రస్టుకు కేటాయించిందని మాల్వీయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పరిణామం కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది.

    Details

    ఖండించిన మంత్రి ఎంబీ పాటిల్

    అయితే, కర్ణాటక పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఈ ఆరోపణలను ఖండించారు. రాహుల్ ఖర్గే అర్హుడైన దరఖాస్తుదారుడని, కేటాయింపు నియమాల ప్రకారం జరిగిందన్నారు.

    ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని, జనరల్ కేటగిరీ కింద మొత్తం చెల్లించారని ఆయన స్పష్టం చేశారు.

    దీనిపై సామాజిక కార్యకర్త దినేష్ కలహళ్లి కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ర గహ్లాట్‌ను ఆశ్రయించి, కేటాయింపు వ్యవహారంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని, ప్రాసిక్యూషన్ అనుమతి కోరారు.

    ప్రస్తుతం అధికార పార్టీకి ఇది పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    కర్ణాటక

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    కాంగ్రెస్

    Amethi-Rahul Gandhi: అమేథీలో రాహుల్ గాంధీ మళ్లీ స్మృతీ ఇరానీతో తలపడతారా? బీజేపీ
    Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి తప్పిన ప్రాణాపాయం  మహారాష్ట్ర
    Karnataka: కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోంది: సీఎం సిద్ధరామయ్య సిద్ధరామయ్య
    Shabbir Ali-Phone tapping: మా ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు: షబ్బీర్ అలీ తెలంగాణ

    కర్ణాటక

    Youth Aattacked in Karnataka: బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన యువకుడిపై దాడికి పాల్పడ్డ ముస్లిం యువత.. బెంగళూరు
    Karnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన హత్య
    World cup T20: వరల్డ్‌ కప్‌ టీ 20 టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్‌ జట్లకు స్పాన్సర్‌ గా నందిని డెయిరీ...  క్రీడలు
    Karnataka: కర్ణాటకలో దారుణం..భార్య ముందే యువతిపై అత్యాచారం.. మతం మారాలని ఒత్తిడి  అత్యాచారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025