NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి
    విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి

    Chandrababu: విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 26, 2025
    08:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూదిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

    సాయంత్రం 4.30 గంటలకు అక్కడికి చేరుకున్న చంద్రబాబు, ప్రధానితో సుమారు 1.15 గంటలపాటు విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించేందుకు 'అమరావతి పునఃప్రారంభం-2025' పేరిట ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని ప్రధానికి అందజేశారు.

    ఈ సందర్భంగా చంద్రబాబు, భవిష్యత్తు అవసరాలను తీర్చగల సమగ్ర నగరంగా అమరావతిని అభివృద్ధి చేయనున్న విధానాలను వివరించారు.

    రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించే అక్షయపాత్రగా అమరావతిని తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.

    Details

    అమరావతిలో పచ్చదనం విస్తరింపజేయాలి

    2015లో ప్రారంభమైన రాజధాని నిర్మాణం, తర్వాతి పరిణామాల వల్ల ఎలా ఆగిపోయిందో వివరించారు. ఇప్పుడు కేంద్రం అందిస్తున్న ఆర్థిక చేయూతతో అమరావతి అభివృద్ధిని మళ్లీ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.

    పర్యావరణం, పౌరజీవితం మధ్య సమతుల్యతను ఉద్దేశ్యంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించినట్టు తెలిపారు.

    ప్రధాని మోదీ కూడా తన ఆలోచనలు పంచుకుంటూ, అమరావతిలో పచ్చదనం విస్తరింపజేయడానికి జపాన్‌లో అనుసరిస్తున్న మియావాకి విధానాన్ని సూచించారు.

    ఈ విధానం వేగంగా పచ్చదనం పెంచే అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. దీనిని ఆచరణలో పెడతామని సీఎం హామీ ఇచ్చారు.

    చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి స్థితి, రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం, ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ ప్రారంభం తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

    Details

     పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక చర్చ

    రాష్ట్రానికి అందిస్తున్న ఆర్థిక ప్యాకేజీకి, ఎస్సీ వర్గీకరణ అమలుకు కేంద్రం అందజేస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు.

    ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.

    దేశ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

    ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు.

    Details

    రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానమంత్రికి ఆహ్వానం

    గత సమావేశాల్లో ప్రధానికి తిరుపతి వేంకటేశ్వర స్వామి విగ్రహం బహూకరించడం, శాలువా కప్పడం వంటి సంప్రదాయాలు పాటించిన చంద్రబాబు, ఈసారి పహల్గాం ఘటన నేపథ్యంలో అవేవీ చేయలేదు.

    రాయలసీమ అభివృద్ధి అంశంపై కూడా ముఖ్యమంత్రి ప్రధానితో చర్చించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌లు, డ్రోన్ సిటీ అభివృద్ధి ప్రణాళికలు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులపై కేంద్రం మద్దతు కోరారు. అలాగే రాష్ట్ర ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి రావాలని ప్రధాని మోదీకి ఆహ్వానం తెలిపారు.

    ఈ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లో స్పందిస్తూ, ''అమరావతి పునఃప్రారంభం కాబోతోంది. ప్రజారాజధాని నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానమంత్రిని ఆహ్వానించానంటూ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    అమరావతి

    Andhra Pradesh: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మూడేళ్లలో పూర్తి.. పనులకు రూ.45 వేల కోట్లతో టెండర్లు భారతదేశం
    Kridaapp: అమరావతి కేంద్రంగా 2027లో జాతీయ స్థాయి క్రీడలు: రాంప్రసాద్‌రెడ్డి భారతదేశం
    Amaravati: అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టు.. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధాని! ఆంధ్రప్రదేశ్
    Amaravati: అమరావతిలో బిట్స్‌ క్యాంపస్.. ఆలయ నమూనాలో నిర్మాణం ఆంధ్రప్రదేశ్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు - ప్రైవేట్ అప్పుల అవసరం ఉండకుండా చూస్తాం: సీఎం చంద్రబాబు  భారతదేశం
    Chandrababu: మిర్చి రైతుల కోసం కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ భారతదేశం
    CM Chandrababu: మిర్చి యార్డ్ సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్
    chilli farmers: మిర్చి రైతులకు ఊరట.. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Y.S.Jagan: పోలీసు శాఖపై వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు..రూల్స్ ఏం చెబుతున్నాయి? భారతదేశం
    AP Anganwadi: అంగన్‌వాడీల్లో పిల్లలకు అందించే మెనూలో మార్పులు.. జిల్లాకో కేంద్రంలో పైలట్‌ ప్రాజెక్టు భారతదేశం
    Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై సంచలన నిర్ణయం.. తెర వెనుక అసలేమైందో తెలుసా? విశాఖపట్టణం
    Investments: రూ.31,617 కోట్లతో రాష్ట్రంలో 32,633 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్! చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025