NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ambedkar Jayanti 2023: దేశంలోనే డాక్టరేట్‌ అభ్యసించిన మొదటి వ్యక్తి అంబేద్కర్ 
    తదుపరి వార్తా కథనం
    Ambedkar Jayanti 2023: దేశంలోనే డాక్టరేట్‌ అభ్యసించిన మొదటి వ్యక్తి అంబేద్కర్ 
    అంబేద్కర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు మీకోసం

    Ambedkar Jayanti 2023: దేశంలోనే డాక్టరేట్‌ అభ్యసించిన మొదటి వ్యక్తి అంబేద్కర్ 

    వ్రాసిన వారు Stalin
    Apr 14, 2023
    05:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ స్ఫూర్తిమంత్రం. ఆయనో చైతన్య దీప్తి. న్యాయ కోవిదుడిగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా అన్నింటికి మించి భారత రాజ్యాంగం ప్రధాన రూపశిల్పిగా ఆయన ప్రసిద్ధి.

    ఏప్రిల్ 14(శుక్రవారం) అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.

    రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. అంబేద్కర్ దాదాపు 64 సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు పూర్తి చేశారు. ఆయన తొమ్మిది భాషలు అనర్గళంగా మాట్లాడగలరు.

    ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 21సంవత్సరాలు ఆయన విద్యను అభ్యసించారు. అందుకే అంబేద్కర్‌ను ప్రపంచ మేథావుల్లో ఒకరిగా చెప్పుకుంటారు.

    భారతదేశంలోనే డాక్టరేట్‌ను అభ్యసించిన మొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కావడం గమనార్హం.

    అంబేద్కర్

    లండన్ మ్యూజియంలో విగ్రహం ఉన్న ఏకైక భారతీయుడు అంబేద్కర్

    బాబాసాహెబ్ అంబేద్కర్‌ బుద్ధిస్టుగానే అందరికీ సుపరిచితం. కానీ ఆయన మహారాష్ట్రలోని మహార్ కులానికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించారని చాలామందికి తెలియదు.

    1956లో ఆయన బౌద్ధమతం స్వీకరించారు.అలాగే భారత్‌లో ఏ మేథావికి దక్కని గౌరవం అంబేద్కర్‌కు దక్కింది.

    లండన్ మ్యూజియంలో కార్ల్ మార్క్స్‌ తోపాటు అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.లండన్ మ్యూజియంలో విగ్రహం ఉన్న ఏకైక భారతీయుడు అంబేద్కర్ కావడం గమనార్హం.

    అంతేకాదు, తాగునీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ ఇంటిపేరు చాలా మందికి తెలియదు. ఆయన అసలు ఇంటిపేరు 'అంబావాడేకర్'.

    ఆయన తండ్రి రామ్‌జీ మలోజీ సక్పాల్ ఆర్మీ ఆఫీసర్‌గా పనిచేశారు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్ హోదాలో పని చేశారు.

    అంబేద్కర్

    అంబేద్కర్‌ లైబ్రరీలో 50వేలకు పైగా పుస్తకాలు 

    భారత త్రివర్ణ పతాకంలో 'అశోకచక్ర'కు స్థానం కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుంది.

    నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అమర్త్యసేన్ అంబేద్కర్‌ను 'ఫాదర్ ఇన్ ఎకనామిక్స్'గా భావిస్తారు.

    మధ్యప్రదేశ్, బిహార్‌ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాల విభజనను 1950లో అంబేద్కర్ ప్రతిపాదించారు. అయితే అది అప్పుడు వీలు కాలేదు.

    2000 తర్వాత మధ్యప్రదేశ్, బిహార్‌లను విభజించి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లను ఏర్పాటు చేశారు.

    అంబేద్కర్ వ్యక్తిగత లైబ్రరీ 'రాజ్‌గిర్'లో 50వేల కంటే ఎక్కువ పుస్తకాలు ఉంటాయి. ఇది వరల్డ్‌లోనే అతిపెద్ద ప్రైవేట్ లైబ్రరీ కావడం గమనార్హం.

    లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అంబేద్కర్ 8సంవత్సరాల చదువును కేవలం 2ఏళ్ల 3నెలల్లో పూర్తి చేసి ఆశ్చర్య పరిచారు. ఇందుకోసం రోజుకు 21గంటలు చదువుకున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అంబేద్కర్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అంబేద్కర్

    సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరో యువతి హత్య ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా ఐఎండీ
    ట్విట్టర్‌పై దావా వేసిన మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, అధికారులు; ఎందుకో తెలుసా?  ట్విట్టర్
    ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా?  రిలయెన్స్
    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత దిల్లీ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    'నన్నే కరుస్తావా'; పాము తల కొరికిన వ్యక్తి; వీడియో వైరల్ తమిళనాడు
    కాంగ్రెస్‌ను వీడటానికి రాహుల్ గాంధీనే కారణం: గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్
    BJP Foundation Day: 'నేషన్ ఫస్ట్' మంత్రమే బీజేపీ నినాదం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్ కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025