
Operation Sindoor: సామాజిక మాధ్యమాలలో జాతి వ్యతిరేక పోస్టులపై పై నిఘా ఉంచండి.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర హోంశాఖ (MHA) దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం "ఆపరేషన్ సిందూర్" పేరిట మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఆపరేషన్ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో హోంశాఖ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది అని అధికార వర్గాలు గురువారం ప్రకటించాయి.
వివరాలు
విదేశాల నుంచి భారత్ వ్యతిరేకంగా ప్రచారం.. సోషల్ మీడియా ఖాతాల బ్లాక్
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ భారత్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు నడిపిస్తున్నది.
భారత్ ఈ ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో, హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు ఇచ్చింది.
ఆపరేషన్ సిందూర్ సంబంధించి, భారత్ భద్రతపై తప్పుడు కథనాలు ప్రచారం చేసే సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
దేశం నుంచి లేదా విదేశాల నుంచి భారత్ వ్యతిరేకంగా ప్రచారం జరిగితే, సంబంధిత సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని పేర్కొంది.
ఈ సమయంలో సరిహద్దు ప్రాంతాలలోని ప్రభుత్వాలు, భద్రతా దళాలు మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలను పెంచాలని కూడా పిలుపునిచ్చింది.
వివరాలు
"ఆపరేషన్ సిందూర్" పేరుతో దాడి
మంగళవారం అర్ధరాత్రి, పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం "ఆపరేషన్ సిందూర్" పేరుతో దాడి చేసింది.
ఈ దాడిలో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గామ్లో జరిగిన దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.