NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...!
    తదుపరి వార్తా కథనం
    AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...!
    ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...!

    AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 09, 2024
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మధ్యంతర నివేదిక పంపించింది.

    ఆగస్టు 31 నుండి కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల వల్ల రాష్ట్రంలో 10.64 లక్షల మంది ప్రభావితులయ్యారని నివేదికలో పేర్కొంది.

    రాష్ట్రంలో 31 మంది మరణించగా, ఇద్దరు గల్లంతయ్యారు. వీరిలో ఎన్టీఆర్ జిల్లా అత్యధికంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

    వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగినందున, తాత్కాలిక, శాశ్వత పునరావాస, పునరుద్ధరణ పనులకు రూ.6,880 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది.

    నివేదికలో వాతావరణ మార్పులు, ప్రభావం, కృష్ణా నదిలో ప్రవాహాలు, ప్రకాశం బ్యారేజీ డిజైన్ పునఃపరిశీలన, కరకట్టలను బలోపేతం చేయాలని కూడా ఆ నివేదికలో ప్రస్తావించారు.

    వివరాలు 

    ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్ట కట్టాలి

    ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్ట నిర్మించాలని, విజయవాడలో కొన్ని ప్రాంతాలు ఆకస్మిక వరదలతో ముంపుకు గురవుతున్నాయని కూడా నివేదికలో పేర్కొంది.

    బుడమేరు డ్రెయిన్‌తో పాటు డైవర్షన్‌ కెనాల్‌లో ప్రవాహాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించింది.

    ఎన్టీఆర్ జిల్లాలో 2.32 లక్షల కుటుంబాలు, 7.04 లక్షలమంది వరద ప్రభావం ఎదుర్కొన్నారు.

    అంతే కాకుండా, 2.37 లక్షల మంది రైతులకు చెందిన 5.02 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని నివేదిక తేల్చింది.

    వ్యవసాయ, ఉద్యానశాఖలు ప్రాథమికంగా అంచనా వేయగా, రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.341.30 కోట్ల పంపిణీ అవసరమని తెలిపింది.

    వరదల కారణంగా 95 గేదెలు, ఆవులు, 325 మేకలు, గొర్రెలు మరణించగా, 226 పడవలు పాక్షికంగా, 217 పూర్తిగా దెబ్బతిన్నాయని గుర్తించారు.

    వివరాలు 

    త్వరలో ఆపరేషన్ బుడమేరు

    రోడ్లపై వరద నీరు 238 చోట్ల పారగా, 114 చోట్ల చెరువులు, 79 చోట్ల గండ్లు పడ్డాయని నివేదికలో పేర్కొన్నారు.

    558 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయ్, 6,382 వీధి దీపాలు పాడైపోయాయి, 195 కి.మీ. తాగునీటి పైపులైన్లకు నష్టం ఏర్పడింది.

    విజయవాడ వరద ప్రాంతాల్లో 1200 వాహనాలతో రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

    ఇప్పటివరకు 80 సచివాలయాలలో రేషన్ పంపిణీ అయిందని, 7,100 మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

    కూరగాయల పంపిణీని కొనసాగిస్తామని, సహాయక చర్యల్లో ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తోందని చెప్పారు.

    ఆపరేషన్ బుడమేరు త్వరలో ప్రారంభిస్తామని, ల్యాండ్ గ్రాబర్స్, పోలిటికల్ సపోర్టుతో అక్రమాలు చేసే వారికి చట్టం కఠినంగా అమలుచేయబడుతుందని ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    కేంద్ర ప్రభుత్వం
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక తెలంగాణ
    Narendra Modi: వచ్చే వారం ఏపీ పర్యటనకు ప్రధాని రాక..? కారణం ఇదే! నరేంద్ర మోదీ
    Potula Sunita: వైసీపీకి మరో బిగ్ షాక్.. రాజీమానా చేసిన ఎమ్మెల్సీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్ పెన్షన్

    కేంద్ర ప్రభుత్వం

    Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న' బిహార్
    Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు  పేటియం
    Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా  చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్  దిల్లీ
    Farmers Protest: 'ఢిల్లీ చలో' మార్చ్‌కు రైతులు తాత్కాలిక విరామం.. కొత్త MSP ప్రణాళికను ప్రతిపాదించిన కేంద్రం  భారతదేశం

    చంద్రబాబు నాయుడు

    Days After Oath: చంద్రబాబు, రేవంత్ పెండింగ్ సమస్యలపై కీలక భేటీ  రేవంత్ రెడ్డి
    Chandrababu:నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. రేపు ప్రధాని,ఇతర మంత్రులతో  భేటీ  భారతదేశం
    PM Modi- Chandrababu: మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ - ఏఏ అంశాలపై చర్చించుకున్నారంటే?  నరేంద్ర మోదీ
    Chandrababu: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇరువురి మధ్య ఐక్యత అవసరమన్న చంద్రబాబు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025