NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra News:  ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra News:  ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం 
    ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం

    Andhra News:  ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 18, 2025
    10:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ సమర్పించిన ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

    సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నివేదికను ఆమోదించి,అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.

    అనంతరం,దీనిపై ప్రత్యేక చర్చ నిర్వహించి సభ ఆమోదం పొందిన వెంటనే కేంద్రానికి పంపనున్నారు.

    కమిషన్‌ రాష్ట్రంలోని ఎస్సీలను గ్రూప్‌-1, 2, 3లుగా విభజించగా, 2023 నవంబరు 15న నియమితమైన ఈ కమిషన్‌ రెండు నెలల్లోపు నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

    కమిషన్‌ సభ్యుడు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా 13 ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీ సంఘాలు, మేధావులు,ఉద్యోగులతో చర్చించి,అభిప్రాయాలను స్వీకరించాడు.

    వివరాలు 

    మూడు కేటగిరీలుగా ఎస్సీలు 

    ఎస్సీల్లోని ఉపకులాల ప్రజాభాగస్వామ్యం,ప్రభుత్వ ప్రయోజనాల పంపిణీపై సమగ్ర అధ్యయనం చేసి,2024 జనవరిలో వైసీపీ హయాంలో జరిగిన కుల గణన నివేదికను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

    ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఎస్సీల్లోని కొన్ని వర్గాలకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు.

    2023 నవంబరు 7న సీఎం చంద్రబాబు 23 మంది కూటమి దళిత ఎమ్మెల్యేలతో సమావేశమై, వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు, ఎన్నికల హామీ తదితర అంశాలపై చర్చించారు.

    జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని జనాభా ప్రాతిపదికన వర్గీకరణ అమలు చేయనున్నట్లు ప్రకటించి, దళిత ఎమ్మెల్యేలు రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన విభజించాలన్న టీడీపీ మేనిఫెస్టో హామీని గుర్తు చేశారు.

    ఎస్సీ వర్గీకరణను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా కాకుండా, ఏ,బీ,సీ విభజించాలని సూచించి,మాదిగ,మాల, రెల్లి,ఇతర వర్గాలుగా విభజించాలని కోరారు.

    వివరాలు 

    రిజర్వేషన్లను 16% నుంచి 18%కి.. 

    ఎస్సీ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లను 16% నుంచి 18%కి పెంచాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు.

    అయితే, వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా నిర్వహించిన గణనను ప్రాతిపదికగా తీసుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

    ఆ గణన అసమగ్రంగా ఉందని మాల సామాజిక వర్గ నేతలు అభిప్రాయపడుతూ, కుల గణనను పునఃసమీక్షించాలని కోరారు.

    గత ప్రభుత్వ ఉద్యోగ నియామక దరఖాస్తుల్లో ఎస్సీ ఉపకులాలను స్పష్టంగా పేర్కొనకపోవడంతో పాటు, జాబితాల్లో తప్పులు ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

    రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎస్సీ ఉపకులాలు ఉన్నప్పటికీ, కమిషన్‌ కేవలం 13 ఉమ్మడి జిల్లాల్లోనే పరిశీలన జరిపిందని, ఎస్సీ ఉపకులాల నివాస ప్రాంతాల్లో పర్యటించలేదని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

    వివరాలు 

    డీఎస్సీ రిజర్వేషన్ల అమలుకై తొందరపాటు నిర్ణయం

    కేవలం 100 రోజుల్లో నివేదిక సిద్ధం చేయడం హడావుడిగా జరిగిందని, డీఎస్సీ రిజర్వేషన్ల అమలుకై తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు.

    1996లో జస్టిస్‌ రామచంద్ర కమిషన్‌ నివేదిక 1997లో, 2006లో జస్టిస్‌ ఉషా మెహ్రా కమిషన్‌ నివేదిక 2007లో సమర్పించగా, ప్రస్తుత అధ్యయనం అత్యల్ప వ్యవధిలో పూర్తి చేయడం తగిన పరిశీలన లేకుండానే నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ ఏర్పాటు చేసి ఉంటే మెరుగైన నివేదిక వచ్చేదని, అనుభవం లేని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించడం వల్ల సమగ్రత కోల్పోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్
    Amritsar: 'భయపడాల్సిన అవసరం లేదు': అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు అమృత్‌సర్
    Operation Sindoor: చండీగఢ్'​లో ఎయిర్ సైరన్​  హెచ్చరిక ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ గుజరాత్

    ఆంధ్రప్రదేశ్

    MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం భారతదేశం
    Nagababu: ఎమ్మెల్యే కోటాలో  ఎమ్మెల్సీగా నాగబాబు! భారతదేశం
    AP Assembly: 2024-25 ఆర్థిక సర్వే వెల్లడి.. శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం భారతదేశం
    Visakhapatnam: రుషికొండ బీచ్‌ పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అదనపు సిబ్బంది నియామకం విశాఖపట్టణం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025