NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే
    ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ

    Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 05, 2024
    09:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేటి నుంచి వరద బాధితులకు ప్రత్యేక కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

    ఈ కిట్లలో నిత్యావసర వస్తువులు, రాయితీ కూరగాయలు కూడా ఉన్నాయి. ప్రతి కుటుంబానికి పాలు, మంచినీరు, బిస్కట్లు అందించడమే కాకుండా, 25 కిలోల బియ్యం, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు, చక్కెరను కూడా ఈ ప్యాకేజీలో భాగంగా అందిస్తున్నారు.

    కూరగాయలను మొబైల్ మార్కెట్ల ద్వారా రూ.2, రూ.5, రూ.10 రేట్లతో విక్రయించనున్నారు, అలాగే ఆకుకూరలు రూ.2 ధర వద్ద అందించనున్నారు.

    వివరాలు 

    అగ్నిమాపక యంత్రాల సాయంతో ఇళ్లు శుభ్రం

    ముఖ్యమంత్రి చంద్రబాబు వరద వల్ల నష్టపోయిన ఇళ్లను, షాపులను ఆదుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు ప్రత్యేక ప్యాకేజీలపై కూడా ఆలోచిస్తున్నట్లు ప్రకటించారు.

    గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.

    వరదల వల్ల పాడైన వస్తువులు,గృహోపకరణాలు,నిత్యావసర వస్తువులు,దుస్తులు పాడైపోయాయి, తలుపులు,వార్డ్‌రోబ్స్‌ సహా అన్నీ మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

    అగ్నిమాపక యంత్రాల సాయంతో ఇళ్లు, రహదారులను శుభ్రం చేస్తున్నామని, ఒక్కింటి నుంచి బురదను తీసేయడానికి సుమారు 20 నిమిషాలు పట్టుతోందని చెప్పారు.

    రోజుకు 250-300 ఇళ్లు శుభ్రం చేయవచ్చని 50 అగ్నిమాపక వాహనాలు విజయవాడకు చేరుకున్నాయి, మరిన్ని వాహనాలు కూడా చేరనున్నాయి.

    ఉద్యాన శాఖ అధికారులకు భారీగా కూరగాయలను సేకరించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.

    వివరాలు 

    వరద ప్రభావిత ప్రాంతాల్లో 62 వైద్య శిబిరాల ఏర్పాటు

    అలాగే కూరగాయలు లేదా పాల ధరలను పెంచే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    అలాంటి వాటిపై కేసులు నమోదు చేసి విజిలెన్స్ అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటామని అన్నారు.

    సాయం అందించాలనుకునే దాతలు నాణ్యమైన ఆహార పదార్థాలు లేదా పప్పుధాన్యాలు అందించాలని కోరారు.

    ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవలు మాత్రమే వరద బాధితుల కోసం వినియోగిస్తున్నాయని, వ్యక్తిగతంగా వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

    వరద ప్రభావిత ప్రాంతాల్లో 62 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    వివరాలు 

    వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు కేంద్రానికి ఆహ్వానం 

    182 ట్యాంకర్ల ద్వారా విజయవాడలో తాగునీరు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గర్భిణులను ఆసుపత్రులకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

    పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించామని, ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ఆహ్వానించామని చెప్పారు.

    ఈ అంశాలపై కేంద్రం ప్రత్యేక బృందం త్వరలో రాష్ట్రంలోకి రానుందని, వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ సేఫ్టీ వంటి అంశాలపై కూడా టీమ్ పరిశీలన జరుపుతుందని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్‌ విడుదల  భారతదేశం
    Atchutapuram SEZ explosion: అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు..17మంది మృతి.. 60 మందికి తీవ్ర గాయాలు భారతదేశం
    IMD Weather : తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణ
    Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి.. ఏకంగా 2,800 కోట్లు..! చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: చంద్రబాబు క్యాబినెట్‌లో కులాల సమతూకం .. ఏఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయో తెలుసా?  భారతదేశం
    Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు..  మెగా Dsc ఫైలుపై తోలి సంతకం   భారతదేశం
    CM Chandrababu :నేడు పోలవరం పర్యటనకు చంద్రబాబు.. ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష  పోలవరం
    Chandrababu Naidu :చంద్రబాబు భావోద్వేగం ..మళ్లీ జన్మ ఉంటే.. కుప్పంలో పుడతా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025