NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: అసహజ శృంగారానికి డిమాండ్‌.. స్నేహితుడి దారుణహత్య
    తదుపరి వార్తా కథనం
    Delhi: అసహజ శృంగారానికి డిమాండ్‌.. స్నేహితుడి దారుణహత్య
    Delhi: అసహజ శృంగారానికి డిమాండ్‌.. స్నేహితుడి దారుణహత్య

    Delhi: అసహజ శృంగారానికి డిమాండ్‌.. స్నేహితుడి దారుణహత్య

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2024
    09:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అసహజ శృంగారానికి బలవంతం చేయడంతో 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురైనట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

    డిసిపి నార్త్ మనోజ్ కుమార్ మీనా సోమవారం మాట్లాడుతూ.. దిల్లీలోని మోరీ గేట్‌కు దగ్గరలోని డీడీఏ పార్క్‌ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందని తెలిపారు.

    ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా పార్క్‌లోని ఏకాంత ప్రదేశంలో గుర్తు తెలియని మృతదేహంపై తీవ్ర గాయాలు ఉన్నాయన్నారు.

    దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.

    నార్త్ డిస్ట్రిక్ట్ క్రైమ్ టీమ్,ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(FSL)బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ రెండు బృందాలు నేరస్థలాన్ని పరిశీలించాయి.

    Details

    శుక్లాతో బాటు చివరిసారిగా రాజేష్‌

    విచారణలో,బృందం ఖోయా మండి, మోరీ గేట్,కశ్మీర్ గేట్ PS సమీపంలోని 50 కి పైగా సిసిటివి కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు.అయితే ఎటువంటి క్లూ దొరకలేదు.

    బాధితుదీని గుర్తించేందుకు స్థానిక ఇంటెలిజెన్స్‌ను నియమించారు.

    బాధితుడిని ఉత్తర్‌ప్రదేశ్ లోని జలోన్ జిల్లా రుదుర్‌పురా గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ శుక్లాగా గుర్తించారు. అతను రాకేష్ తోమర్ దుకాణంలోని ఖోయా మండిలో పని చేస్తున్నాడని, ఖోయా మండి సమీపంలోని మోరీ గేట్ వద్ద ఉన్న రెయిన్ బసేరాలో నివాసముంటున్నాడని డీసీపీ మీనా తెలిపారు.

    శుక్లాతో బాటు చివరిసారిగా రాజేష్‌ అనే వ్యక్తి చివరిసారిగా కనిపించాడు.బాధితుడు ప్రమోద్ కుమార్ శుక్లా,రాజేష్ స్నేహితులు.

    ఢిల్లీలోని మోరీ గేట్ వద్ద ఖోయా మండి సమీపంలో ఉన్న రెయిన్ బసేరాలో కలిసి నివసించారు.

    Details

    పోలీసుల ఎదుట హత్య చేసినట్లు ఒప్పుకున్న రాజేశ్‌  

    సాంకేతిక నిఘా ఆధారంగా,రాజేష్ మొబైల్ నంబర్‌ ద్వారా అతడిని బీహార్‌లోని పాట్నాలో అదుపులోకి తీసుకోని విచారించగా విషయం బయటకు వచ్చింది.

    విచారణలో నిందితుడు రాజేష్ కుమార్ బాధితుడు ప్రమోద్ కుమార్ శుక్లా తన స్నేహితుడని,అతనితో అసహజ శృంగారం చేయమని ఒత్తిడి చేసేవాడని, అందుకే ప్రణాళిక వేసుకుని హత్య చేసినట్లు రాజేశ్‌ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

    Details

    హత్య తరువాత అమృత్‌సర్‌కు వెళ్లిన రాజేష్ 

    అతనిని హత్య చేసిన తర్వాత, శుక్లా జేబులో నుండి ₹ 18,500, అతని కీప్యాడ్ మొబైల్ తీసుకున్నాడు. అతను ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో బాధితుడి మొబైల్ ఫోన్‌ను ₹ 400కి విక్రయించాడు.

    ఆ తర్వాత అరెస్టు నుంచి తప్పించుకునేందుకు రైలులో పంజాబ్‌లోని అమృత్‌సర్‌ కి వెళ్లాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న తర్వాత, అతను శుక్లా నుండి దోచుకున్న డబ్బు నుండి ₹ 10,000కి మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేశాడు.

    మొబైల్ ఫోన్ క్యాష్ మెమో స్లిప్‌తో పాటు అదే మొత్తం, మొబైల్ ఫోన్ డీలర్ నుండి రికవరీ చేయబడింది. ఈ కేసులో నిందితుడు రాజేష్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హత్య

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    దిల్లీ

    Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు హత్య
    IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే  ఐపీఎల్
    BharatPe: 'భారత్ పే'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు.. అష్నీర్ గ్రోవర్‌కు జరిమానా  హైకోర్టు
    Delhi airport: దిల్లీ విమానాశ్రయంలో 20 విమానాలు దారి మళ్లింపు.. కారణం ఇదే.. విమానాశ్రయం

    హత్య

    దిల్లీలో 25 ఏళ్ల యువకుడు దారుణ హత్య  దిల్లీ
    UP beheaded: యూపీలో ఘోరం.. ఇద్దరు చెల్లెళ్ల తలలు నరికిన అక్క ఉత్తర్‌ప్రదేశ్
    బెంగళూరు:వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుణ్ని ప్రేమించిందని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి బెంగళూరు
    నిఠారీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. సురేంద్ర, మణిందర్ మరణశిక్ష రద్దు  అలహాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025