NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Haryana Assembly Elections 2024: ఆప్‌కి మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన నీలోఖేరి అభ్యర్థి 
    తదుపరి వార్తా కథనం
    Haryana Assembly Elections 2024: ఆప్‌కి మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన నీలోఖేరి అభ్యర్థి 
    ఆప్‌కి మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన నీలోఖేరి అభ్యర్థి

    Haryana Assembly Elections 2024: ఆప్‌కి మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన నీలోఖేరి అభ్యర్థి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 03, 2024
    09:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది.

    నీలోఖేరి (రిజర్వ్‌డ్) నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి అమర్ సింగ్ అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

    పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సమక్షంలో అమర్ సింగ్ కాంగ్రెస్‌లో చేరడం జరిగింది.

    వివరాలు 

    బీజేపీని ఓడించడమే లక్ష్యం: అమర్ సింగ్‌

    ఈ సందర్భంగా బజ్వా, అమర్ సింగ్‌ను స్వాగతిస్తూ, ఆయన ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్‌లో చేరారని ప్రకటించారు.

    ఆపై అమర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించగలిగే సామర్థ్యం కేవలం కాంగ్రెస్‌కే ఉందని, రాష్ట్రంలోని రైతులు, మహిళలు, దళితులు, మైనార్టీలకు బీజేపీ అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

    బీజేపీని ఓడించడమే తన లక్ష్యమని, అందుకోసం తాను కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.

    నీలోఖేరి కాంగ్రెస్ అభ్యర్థి ధరంపాల్ గొండర్‌కు మద్దతు ప్రకటిస్తూ, ఆయన తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు.

    హర్యానాలో ప్రధాన పోటీ కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్యేనని ఆయన అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

    బీజేపీలో చేరిన ఫరీదాబాద్ ఆప్ అభ్యర్థి 

    అమర్ సింగ్ తన అభ్యర్థిత్వాన్ని కొనసాగిస్తే, ఓట్లు విభజనకు గురై బీజేపీకి లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.

    బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.

    ఇక ఫరీదాబాద్ ఆప్ అభ్యర్థి ప్రవేశ్ మెహతా సెప్టెంబర్ 28న బీజేపీలో చేరారు. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు అక్టోబర్ 8న ప్రకటించబడతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా

    తాజా

    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర

    హర్యానా

    Video: అపార్ట్మెంట్ లోపలికి చొరబడిన చిరుత  భారతదేశం
    Illegal mining: మైనింగ్ కేసులో ఐఎన్‌ఎల్‌డీ మాజీ ఎమ్మెల్యే,సహచరుల ప్రాంగణంలో ఈడీ దాడులు  భారతదేశం
    Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకు లేఖ రాసిన 500 విద్యార్థినులు యూనివర్సిటీ
    Divya Pahuja: హర్యానా కాలువలో మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం గుర్తింపు గురుగ్రామ్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025