NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అదానీ గంగవరం పోర్టు ముట్టడి ఉద్రిక్తతం.. 9 డిమాండ్లు నేరవేర్చాలని యూనియన్ పట్టు
    తదుపరి వార్తా కథనం
    అదానీ గంగవరం పోర్టు ముట్టడి ఉద్రిక్తతం.. 9 డిమాండ్లు నేరవేర్చాలని యూనియన్ పట్టు
    9 డిమాండ్లు నేరవేర్చాలని యూనియన్ పట్టు

    అదానీ గంగవరం పోర్టు ముట్టడి ఉద్రిక్తతం.. 9 డిమాండ్లు నేరవేర్చాలని యూనియన్ పట్టు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 17, 2023
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణంనగరంలోని అదానీ గంగవరం పోర్టు కార్మికులు కదం తొక్కారు. ఈ మేరకు యాజమాన్యానికి 9 డిమాండ్లతో కూడిన షరతును విధించారు.

    ఈ నేపథ్యంలోనే పోర్టు కార్మిక సంఘాలకు,యాజమాన్యానికి మధ్య గురువారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమయ్యాయి.

    9 డిమాండ్లలో కేవలం మూడింటిపైనే యాజమాన్యం సానుకూలంగా స్పందించినట్లు యూనియన్ వెల్లడించింది. మిగతా 6 డిమాండ్లపైనా అనుకూలంగా వ్యవహరించాలని సంఘం పట్టుబడుతోంది.

    ఇందుకోసం యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపింది. మరోవైపు పోర్టు నిర్మాణానికి స్థానిక ప్రజలు తమ భూములను దారాదత్తం చేశారని గుర్తు చేసింది.

    పోర్టుకు భూములు ఇచ్చిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాని డిమాండ్ చేస్తోంది. పోర్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని యూనియన్ కోరుతోంది.ఈ మేరకు రూ.36,500 చెల్లించాలని పట్టుబట్టింది.

    DETAILS

    వీఆర్ఎస్ తీసుకుంటే రూ.50 లక్షలు చెల్లించాలి: యూనియన్

    మరోవైపు విధుల నుంచి తొలగించిన కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాల కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. వీఆర్ఎస్ తీసుకుంటే ఒక్కో కార్మికుడికి రూ. 50 లక్షలు చెల్లించాలన్నారు.

    గత 45 రోజులుగా కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో గురువారం పోర్టు ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.

    బారికేడ్లను తొలగించుకుంటూ కార్మికులు పోర్టులోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ మేరకు కార్మిక సంఘాలను,భూ నిర్వాసితులను పోలీసులు అడ్డుకోగా పలువురికి గాయాలయ్యాయి.

    దీంతో పోర్టు గేట్ వద్దే బైఠాయించిన కార్మికులతో ఆర్డీఓ చర్చించారు. మొత్తం 9 డిమాండ్లను యూనియన్ నేతలు ప్రభుత్వం ముందుకు తెచ్చారు. త్వరలోనే తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    అదానీ గ్రూప్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    ఆంధ్రప్రదేశ్

    ఏపీ, బాంబే హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలిజీయం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం హైకోర్టు
    సీఎం జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌లో  నడిపిస్తున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం  హోంశాఖ మంత్రి
    ఏపీ:ఆకివీడులో ఘోరం.. ఇంట్లోకి చొరబడి తాత,తల్లిపై దాడి, యువతి అపహరణ  పశ్చిమ గోదావరి జిల్లా

    అదానీ గ్రూప్

    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతదేశం
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి గౌతమ్ అదానీ
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ గౌతమ్ అదానీ
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025