AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై చర్చించే అవకాశం
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై జనవరి 31న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ పథకం అమలుకు ప్రభుత్వం చేసే వార్షిక వ్యయంపై ఆర్థిక శాఖ సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
ఈ పథకంతో ప్రభుత్వంపై అదనపు భారం
ఈ పథకం ప్రవేశపెడితే ప్రభుత్వంపై రూ.1,440 కోట్ల అదనపు భారం పడనుంది. రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్ల మద్దతు పొందేందుకు ఈ పథకం దోహదపడుతుందని అధికార వైఎస్సార్సీపీ అభిప్రాయపడుతోంది. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కేబినెట్ సమావేశంలోనూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్పై కూడా చర్చించే అవకాశం ఉంది.