NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. . వరద బాధితులకు ప్యాకేజీ
    తదుపరి వార్తా కథనం
    Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. . వరద బాధితులకు ప్యాకేజీ
    చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన

    Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. . వరద బాధితులకు ప్యాకేజీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 18, 2024
    10:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

    ముఖ్యంగా బుడమేరులో మూడు చోట్ల పునరావాస గండ్లు ఏర్పడి, వరద నీరు విజయవాడ నగరంలోని ఇళ్లను ముంచెత్తింది. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

    అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు తక్షణ సహాయం అందేలా చర్యలు చేపట్టారు.

    నష్టపోయిన ప్రతి కుటుంబానికి అండగా నిలబడి, వారికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

    ఈ మేరకు వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు.

    వివరాలు 

    సీఎం ట్వీట్ ఇదే.. 

    "భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వారికి విశేషమైన ప్యాకేజీని ప్రకటించాం.విజయవాడ నగరంలో వరదలో చిక్కుకున్న ప్రతి ఇంటికి రూ.25 వేలు,పై అంతస్తుల్లో ఉన్న వారికి రూ.10వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరదల వల్ల ఇల్లు నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేలు సాయం చేస్తాం" అని పేర్కొన్నారు.

    అదనంగా,కిరాణా దుకాణాలు,చిన్న వ్యాపారాలు కోల్పోయిన వారికి రూ.25 వేలు,ఎంఎస్ఎంఈలు, ఇతర వ్యాపార సంస్థలకు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.

    వివరాలు 

    ఉద్యానవన పంటలకు హెక్టారుకు రూ.35 వేలు సాయం

    అలాగే,ద్విచక్ర వాహనాలకు రూ.3 వేలు,ఆటోల కోసం రూ.10 వేలు పరిహారం అందిస్తామని చెప్పారు.

    వ్యవసాయ పంటల నష్టానికి హెక్టారుకు రూ.25 వేలు,ఉద్యానవన పంటలకు హెక్టారుకు రూ.35 వేలు సాయం అందజేస్తామని సీఎం తెలిపారు.

    ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వమంతా బాధితులకు అండగా నిలుస్తుందని, బ్యాంకులు, బీమా సంస్థల సహకారంతో మరింత సాయం అందిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

    మత్స్యకారుల బోట్లకు, చేనేత కార్మికులకు, పశువులను కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తున్నాము. వరదల సమయంలో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా అన్ని విషయాలు పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నాము అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చంద్రబాబు చేసిన ట్వీట్ 

    భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మంచి ప్యాకేజీని ప్రకటించాము. విజయవాడ వరదల సమయంలో 10 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నే సచివాలయంగా మార్చుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి బాధితులకు సాయం చేశాను. ఇప్పుడు నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ… pic.twitter.com/AbyKRcBTiL

    — N Chandrababu Naidu (@ncbn) September 18, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం
    Aishwarya Rai: కేన్స్‌లో సిందూరంతో ఐశ్వర్య రాయ్.. లుక్‌పై నటి సెలీనా జైట్లీ ఆసక్తికర స్పందన అమితాబ్ బచ్చన్

    చంద్రబాబు నాయుడు

    ChandraBabu: ఏపీ ప్రజల తరుఫున ధన్యవాదాలు మోడీ జీ... బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    Chandrababu: మద్యం పాలసీలో కుంభకోణం.. జగన్ పై సీఐడీ విచారణకు ఆదేశించిన చంద్రబాబు  భారతదేశం
    Chandrababu Naidu: అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు  భారతదేశం
    Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు చంద్రబాబు చర్చలు భారతదేశం

    ఆంధ్రప్రదేశ్

    Heavy rains: ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాల ఎఫెక్టు.. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి పలు రైళ్లు రద్దు  భారీ వర్షాలు
    Andhrapradesh Cyclone : ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్! భారతదేశం
    Vijayawada: వరదలో చిక్కుకున్న విజయవాడ.. ప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..! విజయవాడ వెస్ట్
    Drone in vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా.. ట్రయల్‌ రన్‌ కు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025