NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amarawati: అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా గెజిట్.. జూన్‌ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని
    తదుపరి వార్తా కథనం
    Amarawati: అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా గెజిట్.. జూన్‌ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని
    అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా గెజిట్

    Amarawati: అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా గెజిట్.. జూన్‌ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 26, 2024
    10:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో అధికారికంగా ప్రకటన చేసింది.

    అయితే, గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయడంపై ఇంకా చర్యలు పూర్తి కాలేదు.

    విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని గడువు ఈ ఏడాది జూన్‌ 2న ముగిసినా, కేంద్రం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో అమరావతి భవిష్యత్తు సంబంధించి సందిగ్ధత కొనసాగుతోంది.

    వివరాలు 

    గతం నుంచి ప్రస్తుతం వరకు 

    2014లో రాష్ట్ర విభజన అనంతరం, గుంటూరు-విజయవాడ ప్రాంతం మధ్య అమరావతిని రాజధానిగా ప్రకటించారు.

    భూ సమీకరణతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.10వేల కోట్ల వ్యయం చేశారు.

    2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి నిర్మాణం నిలిపివేసి, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారుస్తున్నట్లు ప్రకటించింది.

    ఈ నిర్ణయం రైతుల నుంచి వ్యతిరేకతకు దారితీసింది, అలాగే పెట్టుబడిదారుల్లోనూ అనిశ్చితి కలిగించింది.

    వివరాలు 

    అమరావతిని చుట్టుముట్టిన వివాదాలు 

    రాజధాని నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 51,000 ఎకరాలు సమీకరించినా, 2019లో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల మోడల్‌ను ప్రవేశపెట్టింది.

    ఇది రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో అనేక మార్పులకు కారణమైంది. హైకోర్టు తుది తీర్పు వెలువడిన తరువాత ఈ అంశం న్యాయపరమైన స్థిరత్వానికి వచ్చినా, పౌరుల్లో ఇంకా సందేహాలు తొలగలేదు.

    వివరాలు 

    కేంద్రం వైఖరి 

    విభజన చట్టం ప్రకారం, ఏపీ రాజధాని అంశంపై కేంద్రం అధికారిక నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉంది.

    ఈ నోటిఫికేషన్‌ లేకుండా కేంద్రం ద్వారా విడుదలవుతున్న నిధులకు షరతులు ఉండే అవకాశం ఉంది.

    బీజేపీ వర్గాల ప్రకారం, అన్ని రకాల వివాదాలకు ముగింపు పలకడం లక్ష్యంగా కేంద్రం చట్టబద్ధ నిర్ణయాలపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది.

    2024 ఎన్నికల ముందు రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.

    ఈ సమయంలో, నార్మన్ ఫాస్టర్ సంస్థకు రాజధాని డిజైన్‌ల బాధ్యతలు అప్పగించడం, టెండర్ల ప్రక్రియను పునఃప్రారంభించడం వంటి చర్యలు అమరావతిపై మళ్లీ దృష్టి సారించాయి.

    వివరాలు 

     కొన్ని ప్రాజెక్టులకు ఆమోదం: నారాయణ  

    అమరావతిని రాజధానిగా పరిపాలనాధికంగా గుర్తించడంలో నిర్లక్ష్యం, నిధుల వినియోగంలో జాప్యం, మూడు రాజధానుల మోడల్ వంటి సమస్యలు రాష్ట్ర రాజధాని భవిష్యత్తుపై మబ్బులు కమ్మాయి.

    కేంద్రం, రాష్ట్రం కలిసి ఈ అంశాన్ని తీర్చేద్దామని భావించినా,ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సమస్యలను మరింత సంక్లిష్టం చేశాయి.

    సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కొన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

    త్వ‌ర‌లోనే వీటి తుది డిజైన్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామ‌ని అన్నారు.గత ప్రభుత్వం నోటీసు ఇవ్వకుండానే టెండర్లు రద్దు చేయడంతో, నార్మన్ ఫోస్టర్ సంస్థ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిందని, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ద్వారా వారికి 9 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు.

    ఈ పరిస్థితుల కారణంగా,టెండర్లను మళ్లీ పిలవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.

    వివరాలు 

    దశలవారీగా రుణం అందించనున్న ప్రపంచ బ్యాంకు

    రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, ప్రపంచ బ్యాంకు రుణంపై ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు.

    దశలవారీగా రుణం అందించడానికి ప్రపంచ బ్యాంకు ఇప్పటికే అంగీకరించిందని తెలిపారు.

    రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుందని మంత్రి నారాయణ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025