NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర
    తదుపరి వార్తా కథనం
    AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర
    సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర

    AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్‌ సమావేశం విజయవంతంగా ముగిసింది.

    ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది.

    ముఖ్యంగా, రక్షిత మంచినీటి సరఫరా కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో సుమారు రూ. 5.75 కోట్లు, అలాగే కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    అదే సమయంలో, ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేయడానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకున్నారు.

    మరోవైపు, 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి చేయడానికి మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది.

    వివరాలు 

    వైఎస్ఆర్ జిల్లా పేరును అధికారికంగా వైఎస్ఆర్ కడప జిల్లా

    తదుపరి నిర్ణయంలో, వైఎస్ఆర్ జిల్లా పేరును అధికారికంగా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి సంబంధించిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం ప్రకటించింది.

    ఇంకా పలు ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయింపులు,రాయితీల కల్పన గురించి చర్చించారు.

    ఈ ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పరిశ్రమల రంగానికి సంబంధించి 2025 చట్టంలో ఉండే పలు నిబంధనల సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం.

    అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌ షాప్స్‌ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లు 2025లోని నిబంధనల సవరణలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పయ్యావుల కేశవ్ చేసిన ట్వీట్ 

    అమరావతిలో కేబినెట్ సమావేశం – అభివృద్ధికి దిశానిర్దేశక నిర్ణయాలు.

    ఈ రోజు అమరావతి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు.

    సమావేశంలో… pic.twitter.com/eo8GhwYsxH

    — Payyavula Keshav (@PayyavulaOffl) June 4, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర ఆంధ్రప్రదేశ్
    Telegram Update: టెలిగ్రామ్ కొత్త అప్డేట్‌ విడుదల.. యూజర్ల కోసం డైరెక్ట్ మెసేజ్, HD ఫోటో ఫీచర్! టెలిగ్రామ్
    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్.. నిఫ్టీ@24600  స్టాక్ మార్కెట్
    Bombs: జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి మూడు బాంబులు.. 20వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు జర్మనీ

    ఆంధ్రప్రదేశ్

    New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ అప్లై చేయనవసరం లేదు! భారతదేశం
    Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ తెలంగాణ
    AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు భారతదేశం
    Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ కొత్త అప్డేట్.. డబ్బులు ఖాతాల్లో పడాలంటే ఈ విధంగా చేయండి!  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025