NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు
    2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు

    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 24, 2025
    01:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

    'వికసిత్ భారత్ - 2047' లక్ష్యంతో పాటు 'స్వర్ణాంధ్ర ప్రదేశ్' దిశగా రాష్ట్రం చేపడుతున్న ప్రణాళికలను ప్రధానమంత్రి మోదీ సమక్షంలో ప్రస్తావించారు.

    తన ప్రసంగాన్ని పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రారంభించిన చంద్రబాబు, ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం సాధించిన పురోగతిని వివరించారు.

    సమావేశంలో చంద్రబాబు ప్రజంటేషన్‌ ప్రధానంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే అంశాలపై దృష్టి పెట్టింది.

    ఆయన చేసిన ప్రతిపాదనలు 'వికసిత్ భారత్'కు ఉపయుక్తంగా ఉన్నాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

    Details

    చంద్రబాబు ప్రజంటేషన్‌కు విశేష స్పందన

    ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలను ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని సూచించారు. చంద్రబాబు ప్రజంటేషన్‌కు సమావేశంలో విశేషంగా స్పందన లభించింది.

    ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు సమగ్రంగా వివరించారు. రాష్ట్రం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు.

    స్వర్ణాంధ్ర సాధన దిశగా నిరంతరం కృషి జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలోని వనరుల వినియోగ విధానాన్ని, వాటి ద్వారా అభివృద్ధి ఎలా సాధ్యమవుతోందో ప్రజంటేషన్‌లో వివరించారు.

    అంతర్జాతీయ ప్రమాణాల మేరకు విశాఖపట్టణాన్ని అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు.

    Details

    నాలుగు ప్రత్యేక జోన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక

    నాలుగు ప్రత్యేక జోన్లుగా నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు.

    ఇదే మోడల్‌ను అమరావతి, తిరుపతి, కర్నూల్ నగరాలకు విస్తరించేందుకు కేంద్రం సహకరించాలని ఆయన అభ్యర్థించారు.

    డిజిటల్ గవర్నెన్స్ విషయంలో కూడా ఏపీ ముందుందని వెల్లడించిన చంద్రబాబు, గూగుల్ AI వంటి ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు.

    ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా డిజిటల్ ఫ్యామిలీ బెనిఫిట్ పాస్‌బుక్‌ను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    నీతి ఆయోగ్

    తాజా

    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం
    KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    Rahul Gandi: రాహుల్‌ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ.. నాన్‌ బెయిల్‌బుల్ వారెంట్ జారీ  రాహుల్ గాంధీ

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu: అమరావతి నిర్మాణానికి నిధుల కోసం నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పవన్ కళ్యాణ్
    AP Cabinet: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్‌.. పేర్లు మార్పుతో కౌంటర్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం  పవన్ కళ్యాణ్
    Bill Gates: భారత పార్లమెంట్‌ను సందర్శించిన బిల్ గేట్స్.. జేపీ నడ్డాతో కీలక చర్చలు బిల్ గేట్స్
    Bill Gates: బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై కీలక చర్చలు బిల్ గేట్స్

    నీతి ఆయోగ్

    NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా నరేంద్ర మోదీ
    Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025