NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం
    స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం

    Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2025
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆపరేషన్ సిందూర్ సమయంలో అమృత్‌సర్‌లోని ప్రముఖ స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో భారత సైన్యం గగనతల రక్షణ (ఎయిర్ డిఫెన్స్) తుపాకులు లేదా ఇతర రక్షణ పరికరాలను మోహరించలేదని అధికారికంగా వెల్లడించింది.

    పాకిస్థాన్ నుంచి డ్రోన్లు లేదా క్షిపణుల ముప్పు ఉందన్న దృష్టిలో స్వర్ణ దేవాలయంలో ఈ రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారంటూ కొన్ని మీడియాలో ప్రచారం జరగగా, దాన్ని భారత సైన్యం ఖండించింది.

    ఈ వార్తలపై స్పందించిన సైన్యం, "శ్రీ దర్బార్ సాహిబ్ అమృత్‌సర్ (స్వర్ణ దేవాలయం) ప్రాంగణంలో ఎలాంటి గగనతల రక్షణ తుపాకులు లేదా సంబంధిత వనరులను మోహరించలేదు" అని స్పష్టం చేసింది.

    వివరాలు 

    ఆర్మీ అధికారుల నుంచి ఎలాంటి సంప్రదింపులు జరగలేదు  

    ఈ మేరకు స్వర్ణ దేవాలయ అదనపు ప్రధాన పూజారి,శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) కూడా అవాస్తవ వార్తలపై తీవ్రంగా స్పందించింది.

    "గగనతల రక్షణ వ్యవస్థల ఏర్పాటుకు మేము ఎలాంటి అనుమతిని ఇవ్వలేదు" అని వారు స్పష్టం చేశారు.

    SGPC అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి మాట్లాడుతూ,భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, బ్లాక్‌అవుట్ సమయంలో ఆలయ వెలుతురు తక్కువ చేయాలన్న విషయంపై మాత్రమే పరిపాలనా యంత్రాంగం తమతో చర్చించిందని చెప్పారు.

    ఆలయ పవిత్రతను, విధిగా కొనసాగుతున్న మతాచారాలను గౌరవిస్తూ పరిపాలనా సూచనలకు తాము పూర్తిగా సహకరించామని ఆయన వివరించారు.

    అయితే, గగనతల రక్షణ వ్యవస్థల ఏర్పాటు గురించి ఆర్మీ అధికారుల నుంచి ఎలాంటి సంప్రదింపులు జరగలేదని ధామి తెలిపారు.

    వివరాలు 

    ఆలయంలో ఎలాంటి తుపాకుల మోహరింపు జరగలేదు 

    ఈ అంశంపై హర్మందిర్ సాహిబ్ ప్రధాన గ్రంథి రఘ్‌బీర్ సింగ్ కూడా స్పందిస్తూ, తాను ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ఆలయంలో ఎలాంటి తుపాకుల మోహరింపు జరగలేదని స్పష్టంచేశారు.

    స్వర్ణ దేవాలయం అదనపు ప్రధాన పూజారి అమర్జీత్ సింగ్ కూడా మీడియా కథనాలను పూర్తిగా ఖండించారు.

    "ఆలయంలో గగనతల రక్షణ తుపాకులు మోహరించారన్న ఆరోపణ పూర్తిగా అబద్ధం. ఈ ఆరోపణలు మానసికంగా కలిచివేస్తున్నాయి. తాము ఎప్పుడూ అలాంటి ఏర్పాట్లకు అనుమతి ఇవ్వలేదని" స్పష్టం చేశారు.

    వివరాలు 

    ఆలయ పవిత్రత కాపాడం 

    అలాగే, నగర వ్యాప్తంగా జరిగిన బ్లాక్‌అవుట్‌కు సంబంధించి, జిల్లా యంత్రాంగం మార్గదర్శకాల మేరకు ఆలయ యాజమాన్యం ఆలయ వెలుపల, పైభాగంలోని లైట్లను ఆపివేసిందని ఆయన తెలిపారు.

    అయితే, మతపరమైన కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో లైట్లు కొనసాగించామని, ఆచారాలను గౌరవిస్తూ ఆలయ పవిత్రతను కాపాడామని వివరించారు.

    శ్రీ దర్బార్ సాహిబ్, గురు రాందాస్ జీ లంగర్, శ్రీ అఖండ్ పాఠ్ సాహిబ్,ఇతర గురుద్వారాలలో ప్రతిరోజూ జరిగే మతపరమైన కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించబడ్డాయని, వాటిలో ఎవరూ జోక్యం చేసుకునే హక్కు లేదని అమర్జీత్ సింగ్ స్పష్టం చేశారు.

    వివరాలు 

    దేశ భద్రత కోసం సైన్యం కీలక పాత్ర

    ఇటీవలి ఉద్రిక్తతల మధ్య హర్మందిర్ సాహిబ్‌లో అన్ని మతపరమైన పూజలు, ఆచారాలు నిబంధనలకు లోబడి నిరంతరంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

    బ్లాక్‌అవుట్ సమయంలో కూడా మతపరమైన ప్రదేశాల్లో లైట్లను ఆపకుండా "మర్యాద"ను పాటించామని అన్నారు.

    సైన్యం ఈ సంక్షోభ సమయంలో దేశ భద్రత కోసం కీలక పాత్ర పోషించిందని ధామి అభినందించారు.

    అయితే, కొన్ని మీడియా సంస్థలు ఆలస్యంగా తప్పుడు కథనాలు ప్రచురించడం నిరాశకు గురి చేస్తోందని అన్నారు.

    ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ధామి డిమాండ్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమృత్‌సర్

    తాజా

    Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం అమృత్‌సర్
    Gold Rates: ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు బంగారం
    MI vs DC: వర్షం కురిసే అవకాశం.. ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ ముంబయి ఇండియన్స్
    Tamil Nadu: విద్య నిధులను నిలిపివేసినందుకు.. కేంద్రంపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం.. తమిళనాడు

    అమృత్‌సర్

    అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అతని మామ, డ్రైవర్ పంజాబ్
    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు పంజాబ్
    భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు పంజాబ్
    పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా? పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025