NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal-Bhagwant Mann: పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు వార్తల వేళ.. ఆప్‌ అధినేత, పంజాబ్ సీఎం సమావేశం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal-Bhagwant Mann: పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు వార్తల వేళ.. ఆప్‌ అధినేత, పంజాబ్ సీఎం సమావేశం 
    పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు వార్తల వేళ.. ఆప్‌ అధినేత, పంజాబ్ సీఎం సమావేశం

    Arvind Kejriwal-Bhagwant Mann: పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు వార్తల వేళ.. ఆప్‌ అధినేత, పంజాబ్ సీఎం సమావేశం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 11, 2025
    01:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

    అంతే కాకుండా, పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు సంభవించవచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

    ఈ పరిస్థితుల్లో ఆప్‌ ప్రధాన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహించారు.

    దేశ రాజధానిలోని కపుర్తలా హౌస్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు.

    వివరాలు 

    భగవంత్ మాన్, కేజ్రీవాల్ మధ్య అంతర్గత పోరు 

    పంజాబ్ ఆప్ యూనిట్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    ఇదే సమయంలో, సుమారు 30 మంది ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపుల్లో ఉన్నారని కాంగ్రెస్ నేత ప్రతాప్‌సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు.

    అయితే, ఆ వ్యాఖ్యలను ఆప్ ఎంపీ మాల్విందర్ సింగ్ ఖండించారు. కనీసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో టచ్‌లో లేరని దుయ్యబట్టారు.

    ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆప్‌ అధికారాన్ని కోల్పోయింది.

    ఈ పరాజయం తర్వాత భగవంత్ మాన్, కేజ్రీవాల్ మధ్య అంతర్గత పోరు పెరిగిందని బజ్వా అభిప్రాయపడ్డారు.

    అంతేగాక, ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా అన్నారు.

    వివరాలు 

    కేజ్రీవాల్, భగవంత్ మాన్ భేటీకి ప్రాధాన్యం

    తన సోదరుడే బీజేపీలో చేరినప్పుడు బజ్వా అడ్డుకోవలేకపోయారని మాల్విందర్ వ్యంగ్యంగా అన్నారు.

    ఒకవైపు కాంగ్రెస్ నేతలు తమ పార్టీని వీడుతుంటే, బజ్వా మాత్రం ఆప్ ఎమ్మెల్యేలపై ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

    ఈ రాజకీయ పరిణామాల మధ్య కేజ్రీవాల్, భగవంత్ మాన్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

    అయితే, ఏకీభవన సమావేశాలు పార్టీల్లో సాధారణమేనని, భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు ఆప్ నేతలు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్
    భగవంత్ మాన్

    తాజా

    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్

    అరవింద్ కేజ్రీవాల్

    Kejriwal: 'భద్రతా సమస్యలు..' అధికార నివాసాన్ని వీడనున్న కేజ్రీవాల్‌ భారతదేశం
    Arvind Kejriwal: నరేంద్ర మోదీ నాపై కుట్ర చేసి నా ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్నాడు : కేజ్రీవాల్ నరేంద్ర మోదీ
    Atishi: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అతిషి.. పక్కన ఖాళీ కుర్చీతో  అతిషి మార్లెనా
    Arvind Kejriwal: సీఎం నివాసాన్ని రేపు ఖాళీ చేయనున్న కేజ్రీవాల్‌ భారతదేశం

    భగవంత్ మాన్

    పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తెకు ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులు పంజాబ్
    అమృత్‌పాల్‌ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే! పంజాబ్
    'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం పంజాబ్
    అంద‌రికీ ఫ్రీగా గుర్బానీ ప్రసారం.. పంజాబ్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025