NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 73వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, నేడు దిల్లీలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం
    తదుపరి వార్తా కథనం
    73వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, నేడు దిల్లీలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం
    నేడు దిల్లీలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం

    73వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, నేడు దిల్లీలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 17, 2023
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 73వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.

    ఈసారి కూడా సేవా పక్వారా (Seva Pakhwara)ను ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్వారా కార్యక్రమాలు కొనసాగించనుంది.

    మరోవైపు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని చేతివృత్తిదారులకు, హస్తకళాకారుల కోసం ప్రతిష్టాత్మకమైన పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించనున్నారు.

    దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది బీసీలకు రూ. 13 వేల కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పథకం కీలకంగా మారనుంది. బీసీలకు బీజేపీని దగ్గర చేస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

    DETAILS

    నేడే ప్రపంచ స్థాయి యశోభూమి ప్రారంభోత్సవం

    మోదీ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్ బీజేపీ, 30 వేల మంది పాఠశాల బాలికలకు బ్యాంకు ఖాతాలను తెరవనుంది.

    గత తొమ్మిదిన్నరేళ్లలో కేంద్రం సాధించిన కీలక విజయాలను, పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    మరోవైపు దేశంలో కీలకమైన సభలు, సమావేశాలు, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్‌లను నిర్వహించేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం యశోభూమితో పాటు మెట్రోను ప్రారంభించనున్నారు.

    2014లో భారత ప్రధానిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ, ఆ తర్వాత తన చరిష్మాను అంతకంతకూ పెంచుకుంటూ వచ్చారు.

    ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో సబ్‌కా సాత్, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్ నినాదంతో అధికార పీఠాన్ని నిలబెట్టుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    నరేంద్ర మోదీ

    మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి మిజోరం
    India on the moon: చంద్రయాన్-3 విజయవంతం అభివృద్ధికి చెందిన భారతానికి నాంది: ప్రధాని మోదీ  చంద్రయాన్-3
    BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ బ్రిక్స్ సమ్మిట్
    మోదీతో జిన్‌పింగ్.. ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025