
Road Accident: హాపూర్లో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్ప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కాగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైంది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి కారులోంచి మృతదేహాలను బయటకు తీశారు.
సమాచారం ప్రకారం, హాపూర్ జిల్లాలోని జాతీయ రహదారి 09పై అల్లాభక్ష్పూర్ టోల్ ప్లాజా సమీపంలో, కారు అదుపు తప్పి డివైడర్ను దాటి అవతలి వైపుకు చేరుకుంది. ఈ సమయంలో అటువైపు వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఆరుగురు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Details
ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న కారు
ప్రమాదం తర్వాత హైవేపై జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
సోమవారం రాత్రి 12 గంటల సమయంలో హాపూర్ నుంచి మొరాదాబాద్ వైపు వేగంగా కారు వెళుతోంది.
కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారి-9లోని అల్లాబక్ష్పూర్ గ్రామం వద్దకు రాగానే డ్రైవర్ అదుపు తప్పి హైవేపై ఉన్న డివైడర్ను ఢీకొట్టింది.
అతివేగం కారణంగా కారు డివైడర్ను ఢీకొని మొరాదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే రోడ్డుపై బోల్తా పడింది.
ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా ధ్వంసమైంది.
పెద్ద ఎత్తున వాహనాలు ఢీకొన్న శబ్ధం వినిపించిన గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
Details
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలింపు
పోలీసులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా, కారులో ఇరుక్కున్న వ్యక్తులు చాలాసేపటి వరకు బయటకు రాలేకపోయారు.
గ్రామస్థుల సహకారంతో పోలీసులు కారును కట్ చేసి క్షతగాత్రులందరినీ బయటకు తీశారు.
వెంటనే అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆరుగురు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
మీరట్లోని దలు హెడా జిల్లాకు చెందిన రామ్ కిషన్ కుమారుడు సచిన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మీరట్కు తరలించారు.
అతనితో పాటు కారులో అనుపమ్, అంకిత్, జీతు, శంకర్, సందీప్, గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారని గాయపడిన వారు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్నవారు ఘజియాబాద్ ప్రాంతం నివాసితులు.