కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ జాతీయ(బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం బెంగళూరులో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోకు 'ప్రజాధ్వని' అని పేరు పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో మేనిఫెస్టోను పకడ్బందీగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సమాజంలోని ప్రతి వర్గానికి లబ్ధి చేకూరేలాగా మేనిఫెస్టోను తీర్చి దిద్దినట్లు నడ్డా పేర్కొన్నారు. ముఖ్యంగా యువత, పేదలు, రైతులే లక్ష్యంగా బీజేపీ ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఏడాదికి ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు
కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన యూనిఫాం అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో చేర్చింది. యూనిఫాం సివిల్ కోడ్ను చేస్తామని ప్రకటించింది. తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన. దళితులు, ట్రైబల్ మహిళల కోసం ఒనకే ఓబవ సామాజిక న్యాయ నిధి పథకం ఏర్పాటుకు బీజేపీ వాగ్దానం చేసింది. నిరుపేద కుటుంబాలకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం. ప్రతి వార్డులో ఏర్పాటు చేసిన అటల్ ఆహార కేంద్రం ద్వారా ఉచితంగా 0.5 లీటర్ నందిని పాలు పంపిణీ. వ్యవసాయ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీజేపీ పేర్కొంది.