NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Siddaramaiah: కర్ణాటక సర్కారు కూల్చేందుకు.. 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు బీజేపీ ఆఫర్ : సిద్ధరామయ్య
    తదుపరి వార్తా కథనం
    Siddaramaiah: కర్ణాటక సర్కారు కూల్చేందుకు.. 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు బీజేపీ ఆఫర్ : సిద్ధరామయ్య
    కర్ణాటక సర్కారు కూల్చేందుకు.. 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు బీజేపీ ఆఫర్

    Siddaramaiah: కర్ణాటక సర్కారు కూల్చేందుకు.. 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు బీజేపీ ఆఫర్ : సిద్ధరామయ్య

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2024
    11:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.

    బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నట్లు, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వాలని ఆఫర్ చేసినట్లు ఆయన ఆరోపించారు.

    అయితే, ఇందుకు ఏ కాంగ్రెస్ ఎమ్యెల్యే కూడ ఈ ఆఫర్ కి ఒప్పుకోలేదని, బీజేపీ ఇప్పుడు తమపై అబద్ధమైన కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని సీఎం విమర్శించారు.

    సిద్ధరామయ్య, బుధవారం తన స్వస్థలం మైసూరు నగరాన్ని పర్యటించారు, అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం, ప్రజలతో నేరుగా సమావేశమై ప్రసంగించారు.

    వివరాలు 

    బీజేపీ నేతలు మత వివక్షత పెంచేలా తప్పుడు ప్రచారాలు: సిద్దరామయ్య 

    ''సిద్ధరామయ్య సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఇవ్వాలని వారు ప్రతిపాదించారు. ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో? అది ఏదైనా ముద్రిస్తున్నారా? బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, ఆర్ ఆశోకా, బీవై విజయేంద్ర ఈ డబ్బును చెల్లిస్తున్నారా?" అని సీఎం ప్రశ్నించారు.

    అలాగే, బీజేపీ నేతలు మత వివక్షత పెంచేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.

    బందీపుర అభయారణ్యంలోని రహదారులపై రాత్రిళ్లు వాహనాలు రాకుండా చేయాలని ప్రతిపాదనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని సీఎం తెలిపారు.

    డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.

    వివరాలు 

    జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది:  సోమన్న 

    ఈ క్రమంలో ''జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేంద్ర మంత్రి సోమన్న అన్నారు. ఇది కేవలం జోస్యం కాదు, ఇది నిజంగా జరగబోతుంది'' అని వ్యాఖ్యానించారు.

    ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాలలో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిద్ధరామయ్య

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    సిద్ధరామయ్య

    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య కర్ణాటక
    సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం  డీకే శివకుమార్
    కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025