NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రసంగంపై ప్రివిలేజ్ నోటీసులకు సిద్ధమవుతున్నబీజేపీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రసంగంపై ప్రివిలేజ్ నోటీసులకు సిద్ధమవుతున్నబీజేపీ
    రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రసంగంపై ప్రివిలేజ్ నోటీసులకు సిద్ధమవుతున్నబీజేపీ

    Rahul Gandhi: రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రసంగంపై ప్రివిలేజ్ నోటీసులకు సిద్ధమవుతున్నబీజేపీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 04, 2025
    01:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీలు పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

    పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో ప్రసంగించిన రాహుల్, పలుమార్లు చైనా పేరును ప్రస్తావించారు.

    ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్రంగా విమర్శించడంతో, లోక్‌సభలో పరిస్థితి తీవ్రంగా మారింది.

    వివరాలు 

    రాష్ట్రపతి ప్రసంగాన్ని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలం 

    రాహుల్ గాంధీ తన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించలేకపోతే, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు కోరనున్నట్లు సమాచారం.

    ఇదివరకు కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)పై కూడా బీజేపీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

    పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభ ఉపన్యాస సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రసంగాన్ని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపించారు.

    వివరాలు 

    భారత్‌ కంటే చైనా పదేళ్లు ముందుంది: రాహుల్

    లోక్‌సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ, తయారీ రంగంలో భారత్‌ కంటే చైనా పదేళ్లు ముందుందని వ్యాఖ్యానించారు.

    భారతదేశం మోటార్లు, బ్యాటరీలు, ఆప్టిక్స్ వంటి పరికరాల కోసం ఇప్పటికీ చైనా మీద ఆధారపడుతోందని పేర్కొన్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తీసుకొచ్చిన 'మేకిన్ ఇండియా' కార్యక్రమం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, చైనాలో ఉత్పత్తి అయిన వస్తువులు పెద్దఎత్తున భారత మార్కెట్లోకి వస్తున్నాయని ఆయన విమర్శించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    రాహుల్ గాంధీ

    Rahul Gandhi: రాహుల్ గాంధీకి పుణే కోర్టు సమన్లు.. సావర్కర్ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు  పుణే
    Rahul Gandi: కులగణనకు మద్దతుగా 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలి.. రాహుల్ గాంధీ కాంగ్రెస్
    Haryana Results: హర్యానాలో గెలుపుపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్.. కలిసిరాని జాట్లు, జిలేబీ..  హర్యానా
    Rahul Gandhi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన రాహుల్‌ గాంధీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025