NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BJP: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి రూ. 1,737 కోట్లకు పైగా ఖర్చు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    BJP: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి రూ. 1,737 కోట్లకు పైగా ఖర్చు 
    లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి రూ. 1,737 కోట్లకు పైగా ఖర్చు

    BJP: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి రూ. 1,737 కోట్లకు పైగా ఖర్చు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2025
    09:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం రూ.1,737.68 కోట్లు ఖర్చు చేసింది.

    ఈ మొత్తం ఖర్చులో, పార్టీ ప్రచారానికి రూ.884.45 కోట్లు, అభ్యర్థుల ఖర్చుల కోసం రూ.853.23 కోట్లు కేటాయించింది.

    2024 లోక్‌సభ ఎన్నికల వ్యయం నివేదికను బీజేపీ ఎన్నికల సంఘం(ఈసీ)కు సమర్పించింది.

    ఇందులో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు, బల్క్ ఎస్‌ఎంఎస్‌ ప్రచారాలు, కేబుల్, వెబ్‌సైట్స్, టీవీ ఛానెళ్లలో ప్రచారాల కోసం మొత్తం రూ.611.50 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొనబడింది.

    వివరాలు 

    స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చు రూ.168.92 కోట్లు

    ఈ రిపోర్టులో, పార్టీ పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు, జెండాలు వంటి ప్రచార సామగ్రి కోసం రూ.55.75 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.

    అలాగే, బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రచార సభలు, వేదికల ఏర్పాట్లు, ఆడియో సెటప్‌లు, బారికేడ్లు, వాహనాల కోసం అదనంగా రూ.19.84 కోట్లు ఖర్చు చేసింది.

    ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రయాణ ఖర్చులను కూడా ఈ నివేదికలో బీజేపీ పేర్కొంది.

    స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చు రూ.168.92 కోట్లు, ఇతర పార్టీ నాయకుల ప్రయాణం కోసం రూ.2.53 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.

    వివరాలు 

    ప్రచారంపై ఆధారపడిన బీజేపీ  

    సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అరుణాచల్ ప్రదేశ్‌లో రూ.5,552.57 కోట్లు, సిక్కింలో రూ.5,552.41 కోట్లు, ఒడిశాలో రూ.5,555.65 కోట్లు ఖర్చు చేసినట్లు బీజేపీ పేర్కొంది.

    ఈ నివేదిక ద్వారా, కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో గెలుపు సాధించడానికి బీజేపీ ప్రధానంగా ప్రచారంపై ఆధారపడిందని తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    ఎన్నికల సంఘం

    తాజా

    Upcoming IPOs: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో జోష్‌.. మూడు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్‌, ఒక లిస్టింగ్‌! ఐపీఓ
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Gold Rates: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.1630 తగ్గిన తులం బంగారం ధర బంగారం
    Ravi Teja : మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ' రవితేజ

    బీజేపీ

    Election Commission Results: హర్యానా, J&K ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్‌ ఖాతాలో జమ్మూకశ్మీర్‌ హర్యానా
    Haryana Assembly Elections 2024: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ .. ఎగ్జిట్‌ పోల్స్‌ను తలకిందులు చేస్తూ ఎలా గెలిచిందంటే..?   హర్యానా
    Narendra Modi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ'.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు  నరేంద్ర మోదీ
    Haryana: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు హర్యానా

    ఎన్నికల సంఘం

    Loksabha poll-Cash cease: ఎన్నికల కోడ్...భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం, డ్రగ్స్ ఎన్నికలు
    ECI-Jagan: జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఈసీ.. ఇద్దరు ఐపీఎస్‌లపై వేటు  వై.ఎస్.జగన్
    EVM-VVPAT-Supreme Court: 'మేము ఎన్నికలను నియంత్రించలేము': సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు
    Election Commission: ప్రధాని మోదీ-రాహుల్ గాంధీ ప్రసంగాలపై ఎన్నికల సంఘం నోటీసు  రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025