NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
    వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
    భారతదేశం

    వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    June 07, 2023 | 05:30 pm 0 నిమి చదవండి
    వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
    నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి రాసిన లేఖపై కలర్ జిరాక్స్ కాపితో నిన్‌హైడ్రిన్‌ పరీక్ష జరిపేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే హత్య జరిగిన ఘటనా స్థలంలో గతంలో లభించిన వైఎస్ వివేకా రాసిన లేఖను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ అయ్యాక సదరు లేఖను 2021 ఫిబ్రవరి 11న దిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు సీబీఐ తరలించింది. అలాగే వివేకా చేతి దస్తూరితో ఉన్న గత లేఖలను సైతం సీఎఫ్‌ఎస్‌లకు పంపించింది.

    అది ఒత్తిడిలో రాసిన లేఖనే : ఫారెన్సిక్ నిపుణులు

    గత లేఖలను, వైఎస్ వివేకా చేతిరాతను క్షుణ్ణంగా పరీక్షించిన సీఎఫ్‌ఎస్‌ఎల్ ( సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ ) నిపుణులు, అది ఒత్తిడిలో రాసిన లేఖగా తేల్చి చెప్పారు. చేతి రాతతో పాటు లేఖపై ఉన్న వేలిముద్రలనూ గుర్తించాలని ఫారెన్సిక్ నిపుణులను సీబీఐ కోరింది. ఇందుకు నిన్‌హైడ్రిన్‌ పరీక్ష చేస్తే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ బదులిచ్చింది. లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినేందుకు అవకాశం ఉండటంతో సీబీఐ అధికారులు కోర్టు అనుమతి కోరారు. రికార్డుల్లో ఒరిజినల్‌ లేఖకు బదులు కలర్‌ జిరాక్స్‌ అనుమతించాలని సీబీఐ కోరింది. ఈ మేరకు కోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నిన్‌ హైడ్రిన్‌ పరీక్షకు అనుమతిచ్చింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    సీబీఐ
    వైఎస్సార్ కడప
    ఆంధ్రప్రదేశ్

    సీబీఐ

    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    వైఎస్‌ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు  హైకోర్టు
    సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ సుప్రీంకోర్టు

    వైఎస్సార్ కడప

    అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు కడప
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! కర్నూలు
    మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం సీబీఐ
     వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ప్రభుత్వం
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం వర్షాకాలం
    తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ కీలక భేటీ.. ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్ వై.ఎస్.జగన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023