NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Floods : నేడు ఏపీకి కేంద్ర బృందం
    తదుపరి వార్తా కథనం
    AP Floods : నేడు ఏపీకి కేంద్ర బృందం
    నేడు ఏపీకి కేంద్ర బృందం

    AP Floods : నేడు ఏపీకి కేంద్ర బృందం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 05, 2024
    10:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు నాయుడు,రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని,వరద నష్టాన్ని అంచనాకు కేంద్ర బృందం పంపించాలని, తక్షణ సాయం అందించాల్సిన అవసరాన్ని తెలిపే లేఖను రాశారు.

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ అంశంపై స్పందిస్తూ,హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలోని నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

    ఈ బృందం నేడు రాష్ట్రంలో పర్యటించి, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి నివేదిక అందించనుంది.

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,రాష్ట్రంలో వరద పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.

    ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందం వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ,డ్యామ్ భద్రత వంటి అంశాలను పరిశీలించి,నష్టాన్ని అంచనావేసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు.

    వివరాలు 

    క్షేత్ర స్థాయి పర్యటన  

    సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలుపుతూ, కేంద్ర బృందం సిఫారసులు అందించేంత వరకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

    రాష్ట్ర ప్రభుత్వం, బాధిత ప్రజలకు తక్షణ సాయం అందించడంలో పూర్తిగా సహకారం అందించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.

    ప్రస్తుతం, వరద బాధితుల సంఖ్య 6.44 లక్షలకు చేరుకోగా, 42,707 మందిని 193 సహాయక శిబిరాలకు తరలించారు.

    వివరాలు 

    కేంద్రానికి నివేదిక 

    కేంద్ర బృందం హోం శాఖ అదనపు కార్యదర్శి నవీన్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ఏర్పాటైంది.

    ఈ బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సలహాదారు కల్నేర్ కేపీ సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ సిద్దార్ద మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాద్ ఎస్ఈ ఎం రమేష్ కుమార్, ఎన్డీఎస్ఏ సదరన్ జోన్ డైరెక్టర్ గిరిధర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాడెంట్ ప్రసన్న తదితరులు సభ్యులుగా ఉన్నారు.

    ఈ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటన చేసిన తర్వాత, ఈ సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశం అవుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి.. ఏకంగా 2,800 కోట్లు..! చంద్రబాబు నాయుడు
    Ravi Kiran: జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌కు టీటీడీ జేఈఓ బాధ్యతలు? టీటీడీ
    Mount Elbrus: యూరప్‌లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై  భారతదేశం
    Chandrababu Naidu: పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు భారీ ప్లాన్  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025