NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Veena Vijayan: CMRL కేసులో కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై విచారణకు కేంద్రం అనుమతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Veena Vijayan: CMRL కేసులో కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై విచారణకు కేంద్రం అనుమతి
    CMRL కేసులో కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై విచారణకు కేంద్రం అనుమతి

    Veena Vijayan: CMRL కేసులో కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై విచారణకు కేంద్రం అనుమతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 04, 2025
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్ ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నారు.

    ఆమెపై ఆర్థిక నేరానికి సంబంధించిన కేసులో విచారణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

    న్యాయపరమైన విచారణ కొనసాగించేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

    కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అనే ప్రభుత్వరంగ సంస్థ నుంచి టీ వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అన్యాయంగా నిధులు బదిలీ అయినట్లు తేలింది.

    ఈ వ్యవహారంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (SFIO) దాఖలు చేసిన 160 పేజీల ఛార్జ్‌షీటు ఆధారంగా విచారణకు కేంద్రం ఆమోదం తెలిపింది.

    వివరాలు 

    ఎస్ఎఫ్ఐఓ (SFIO) సమగ్ర దర్యాప్తు

    కొచ్చిలోని ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టులో ఈ కేసు నమోదైంది. 2017 నుండి 2020 మధ్య కాలంలో, సీఎంఆర్ఎల్ సంస్థ నుంచి ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు సుమారుగా రూ.1.72 కోట్ల మేర నిధులు బదిలీ అయినట్లు ఆరోపణలున్నాయి.

    ఈ లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇదే అంశంపై ఎస్ఎఫ్ఐఓ (SFIO) సమగ్ర దర్యాప్తు చేపట్టి, విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

    ఈ ఛార్జ్‌షీట్‌లో టీ వీణా విజయన్‌తో పాటు,సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిథర్ కార్తా, మరో 25 మంది వ్యక్తుల పేర్లు నిందితులుగా పొందుపర్చబడ్డాయి.

    వివరాలు 

    కంపెనీస్ యాక్ట్‌లోని సెక్షన్ 447 కింద  ఆరోపణలు 

    ఈ కేసులో టీ వీణా విజయన్ దోషిగా తేలితే, కనీసం ఆరు నెలల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించబడే అవకాశం ఉంది.

    ఇది కంపెనీస్ యాక్ట్ ప్రకారం అమలు చేయబడుతుంది. అలాగే అక్రమంగా పొందిన మొత్తంపై మూడు రెట్లు జరిమానా విధించే అవకాశమూ ఉంది.

    కంపెనీస్ యాక్ట్‌లోని సెక్షన్ 447 కింద వీరి మీద ఆరోపణలు మోపబడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..  అమెరికా
    Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు సినిమా
    Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో  ఇండిగో
    MI vs DC: ఓడిన జట్టు ఔట్.. వాంఖడే వేదికగా ముంబయి-ఢిల్లీ మధ్య ఉత్కంఠ భరిత పోరు ముంబయి ఇండియన్స్

    కేంద్ర ప్రభుత్వం

    Bharatpol: సీబీఐ సహకారంతో 'భారత్‌పోల్‌' పోర్టల్.. అంతర్జాతీయ కేసుల విచారణలో కీలక అడుగు అమిత్ షా
    Jaishankar: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి జైశంకర్ డొనాల్డ్ ట్రంప్
    India-US: భారత్‌,అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసే దురుద్దేశంతో కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.. కేంద్రానికి నివేదిక అంతర్జాతీయం
    Vizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన విశాఖపట్టణం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025