NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sheeshmahal: ఢిల్లీ 'శీష్ మహల్‌'పై విచారణకు ఆదేశించిన కేంద్రం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sheeshmahal: ఢిల్లీ 'శీష్ మహల్‌'పై విచారణకు ఆదేశించిన కేంద్రం
    ఢిల్లీ 'శీష్ మహల్‌'పై విచారణకు ఆదేశించిన కేంద్రం

    Sheeshmahal: ఢిల్లీ 'శీష్ మహల్‌'పై విచారణకు ఆదేశించిన కేంద్రం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2025
    11:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన 'శీష్ మహల్' (Sheeshmahal) వివాదాస్పదంగా మారింది.

    అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శీష్ మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెలువడ్డాయి.

    ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా కీలక నిర్ణయం తీసుకుని బంగ్లాపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

    వివరాలు 

    నివేదిక ఆధారంగా కేంద్రం విచారణకు ఆదేశాలు 

    కేంద్ర ప్రజాపనుల విభాగం నివేదికను సమర్పించిన అనంతరం, ఫిబ్రవరి 13న సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చింది.

    6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లో ఉన్న 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ అధికార నివాసాన్ని ఆధునీకరించడంలో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో కేంద్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరమైన నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

    వివరాలు 

    'శీష్ మహల్' వివాదంలో భారీ ఆరోపణలు 

    ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన అధికారిక నివాసంగా సివిల్ లైన్స్‌లో ఉన్న బంగ్లా ఉపయోగించుకున్నారు.

    అయితే, బీజేపీ ఈ అధికార నివాసాన్ని 'శీష్ మహల్'గా అభివర్ణించింది. దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో ఈ నివాసాన్ని పునరుద్ధరించారని, లగ్జరీ మార్పులు చేశారని ఆరోపించింది.

    ఆధునీకరణలో భాగంగా గోల్డెన్ కమోడ్‌, స్విమ్మింగ్ పూల్‌, మినీ బార్‌ వంటి ఫ్యాన్సీ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు బీజేపీ నేతలు విమర్శలు చేశారు.

    ఈ పునరుద్ధరణ కుంభకోణంగా మారిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి.

    వివరాలు 

    ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం 

    ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది.

    70 స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది.

    ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు, మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్‌ వంటి కీలక నేతలు ఓడిపోవడం ఆ పార్టీకి కఠిన పరీక్షగా మారింది.

    కీలక నేతల్లో ఆతిశీ మాత్రమే గెలుపొందడం ఆప్‌కు కొంత ఊరటనిచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    దిల్లీ

    తాజా

    Shiva Rajkumar: నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదు : శివరాజ్ కుమార్  కమల్ హాసన్
    Russia Ukraine War: 117 డ్రోన్లు.. 18 నెలల గేమ్ ప్లాన్.. రష్యా గుండెల్లో గుబులు పెట్టించిన ఉక్రెయిన్! ఉక్రెయిన్
    Bihar Elections: రెండు లేదా మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..? బిహార్
    Piyush Goyal: వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి: పీయూష్ గోయెల్‌ పీయూష్ గోయెల్‌

    కేంద్ర ప్రభుత్వం

    Suresh Gopi: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.38.41 లక్షల కోట్ల ఆదాయం భారతదేశం
    Phone Tapping: అత్యవసర పరిస్థితుల్లోనే ఫోన్ ట్యాపింగ్‌.. కేంద్రం కొత్త నిబంధనలు ఇండియా
    BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు! కేరళ
    Farmers: రైతులకు ఆధార్‌ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు తెలంగాణ

    దిల్లీ

    Heavy Snowfall: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 150 విమానాలు, 26 రైళ్లు.. భారతదేశం
    Liquor Policy of Delhi: దిల్లీ మద్యం పాలసీ.. కాగ్ నివేదికలో 2,026 కోట్ల నష్టం అరవింద్ కేజ్రీవాల్
    Dense Fog: ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం  వాయు కాలుష్యం
    Delhi Elections: దిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025