NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై నేడు కేంద్రం సర్వసభ్య సమావేశం.. ఏం చర్చించనున్నారంటే?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై నేడు కేంద్రం సర్వసభ్య సమావేశం.. ఏం చర్చించనున్నారంటే?
    ఆపరేషన్ సిందూర్ పై నేడు కేంద్రం సర్వసభ్య సమావేశం.. ఏం చర్చించనున్నారంటే?

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై నేడు కేంద్రం సర్వసభ్య సమావేశం.. ఏం చర్చించనున్నారంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    08:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో,కేంద్ర ప్రభుత్వం నేడు సర్వపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.

    ఈ సమావేశంలో పాకిస్థాన్‌పై తీసుకున్న సైనిక చర్యలు, సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులు వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్టు సమాచారం.

    ఈ రకమైన సున్నితమైన జాతీయ భద్రతా అంశాల్లో అన్ని రాజకీయ పార్టీలు కలసి నడవాలని కేంద్రం భావిస్తోంది.

    ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన చర్యలకు అన్ని పార్టీలూ మద్దతు తెలిపిన నేపథ్యంలో, ఈ సమావేశానికి అన్ని ప్రధాన పార్టీ నేతలను ఆహ్వానించారు.

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

    వివరాలు 

    రక్షణ మంత్రివర్యుల అధ్యక్షతన సమావేశం 

    ఈ సర్వపక్ష సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు.

    హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సహా ఇతర కీలక కేంద్ర మంత్రులు కూడా ఇందులో పాల్గొననున్నారు.

    జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా మాట్లాడుతూ, ప్రధాన పార్టీల నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశముందని తెలిపారు.

    వేదిక, సమయం

    పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.

    ఈ సమావేశం గురించిన సమాచారాన్ని కిరణ్ రిజిజు తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.

    మే 8న ఢిల్లీలో జాతీయ భద్రత అంశాలపై సర్వపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పోస్ట్‌ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కిరణ్ రిజిజు చేసిన ట్వీట్ 

    Govt has called an All Party leaders meeting at 11 am on 8th May, 2025 at Committee Room: G-074, in the Parliament Library Building, Parliament Complex in New Delhi. https://t.co/1hcBepMReC

    — Kiren Rijiju (@KirenRijiju) May 7, 2025

    వివరాలు 

    పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్రం సర్వపక్ష సమావేశం 

    ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం కూడా కేంద్రం సర్వపక్ష సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

    అదే తరహాలో, తాజా భద్రతా పరిస్థితులపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు అవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై నేడు కేంద్రం సర్వసభ్య సమావేశం.. ఏం చర్చించనున్నారంటే? కేంద్ర ప్రభుత్వం
    India-Pakistan: : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి లైన్ అఫ్ కంట్రోల్ (ఎల్ ఓ సి)
    Union Cabinet: తిరుపతి సహా దేశంలోని ఐదు ఐఐటీల్లో రూ.11,828 కోట్లతో విస్తరణ కేంద్ర ప్రభుత్వం
    OMC Case:అక్రమ మైనింగ్‌ కేసులో.. ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురు  సుప్రీంకోర్టు

    కేంద్ర ప్రభుత్వం

    Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం తెలంగాణ
    Flood Relief Fund: 5 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. ఏపీ, తెలంగాణకు ఎంతంటే..? భారతదేశం
    OTT Platforms: రణవీర్ అల్హాబాదియా వ్యాఖ్యల నేపథ్యంలో.. ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు జారీ  ఓటిటి
    IAF: భారత వాయుసేనకు తేజస్‌ కష్టాలకు చెక్‌ .. హైలెవల్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025