NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన 
    తదుపరి వార్తా కథనం
    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన 
    భూటాన్‌లోని 'అమో చు' లోయలో చైనా సైన్యం భారీ నిర్మాణాలపై భారత సైన్యం తీవ్ర ఆందోళన

    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన 

    వ్రాసిన వారు Stalin
    Apr 11, 2023
    01:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న భూటాన్‌లోని 'అమో చు' లోయలో చైనా సైన్యం భారీ నిర్మాణాలను చేపడుతోంది. దీనిపై భారత సైన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

    అమో చు లోయ వ్యూహాత్మక డోక్లామ్ పీఠభూమికి ఆనుకుని ఉంది. ఇది భారతదేశం-చైనా-భూటాన్ డోక్లామ్ ట్రై-జంక్షన్ నుంచి కేవలం కొంత దూరంలో ఉండటం గమనార్హం.

    డోక్లామ్‌లోని నిర్మాణాలపై ఇండియా టుడే ప్రత్యేకంగా ప్రచురించిన తాజా చిత్రాలను విడుదల చేసింది. అమో చులోని కమ్యూనికేషన్ టవర్‌లతో పాటు సైనికులకు శాశ్వత నివాసాలను చైనా సైన్యం నిర్మిస్తున్నట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది.

    చైనా

    దేశ భద్రతా ప్రయోజనాలకు ముప్పు: నిపుణులు

    చైనా సైన్యం 1,000 శాశ్వత సైనిక నిర్మాణాలు, అనేక తాత్కాలిక షెడ్‌లు ఇటీవల నిర్మించినట్లు ఇండియా టుడే విడుదల చేసిన చిత్రాల ద్వారా తెలుస్తోంది.

    డోక్లామ్‌లో భారత సైన్యం నుంచి బలమైన ప్రతీకారాన్ని ఎదుర్కొన్న తర్వాత పశ్చిమాన ఉన్న భారత సరిహద్దుపై పట్టు సాధించాలని చైనా భావిస్తోంది.

    డోక్లామ్‌కు పశ్చిమాన చైనా నియంత్రణలో ఉన్న భూటాన్ భూభాగంలో కార్యకలాపాలు దేశ భద్రతా ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తాయని భారత సైనిక ప్రణాళికదారులు భావిస్తున్నారు.

    డోక్లామ్ పీఠభూమిపై నియంత్రణ చైనాకు వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుందని భారత నిపుణులు అంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    భారతదేశం

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    చైనా

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం రాజ్‌నాథ్ సింగ్
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా కరోనా కొత్త మార్గదర్శకాలు
    పక్షి జాతి ఆవిర్భావం గురించి చెప్పే డైనోసార్ లాంటి తలతో ఉన్న శిలాజం పరిశోధన
    ఆరు దశబ్దాల తర్వాత మొదటిసారి తగ్గిన చైనా జనాభా భారతదేశం

    భారతదేశం

    అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఒప్పందాలను పరిశీలించనున్న సెబీ అదానీ గ్రూప్
    అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు ఆటో మొబైల్
    మారుతి, హ్యుందాయ్, టాటా నుండి 2023లో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ కార్లు ఆటో మొబైల్
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025