NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. సీఆర్డీఏ ఆథారిటీ చర్చించిన అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. సీఆర్డీఏ ఆథారిటీ చర్చించిన అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..
    నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం

    AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. సీఆర్డీఏ ఆథారిటీ చర్చించిన అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 15, 2025
    08:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.

    ఈ సమావేశంలో అమరావతి రాజధాని రెండవ దశ భూసేకరణపై సమీక్ష నిర్వహించి, తుదినిర్ణయం తీసుకోనున్నారు.

    అమరావతి పునఃనిర్మాణ పనులను ప్రారంభించే సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, ఇతర సంబంధిత అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది.

    వివరాలు 

    CRDAకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

    అంతేకాక, సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశంలో ఆమోదించిన పలు పనులకు మంత్రివర్గం నుంచి ఆమోదం పొందనుంది.

    ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో ఉన్న జరీబు భూముల రైతులకు తిరిగి ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి మంత్రివర్గ అథారిటీ నుంచి ఆమోదం లభించనుంది.

    అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA)కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

    అమరావతిలో నిర్మించబోయే హైకోర్టు, శాసనసభ భవనాలకు సంబంధించి టెండర్లను పొందిన సంస్థలకు "లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్" (LOA) జారీ చేయడానికి అనుమతి ఇచ్చే అవకాశముంది.

    వివరాలు 

    ADCకి రూ.473 కోట్ల రూపాయలు మంజూరు

    సీఆర్డీఏ నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థ (ADC)కు రూ.473 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది.

    అలాగే, రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సహక మండలి (SIPB) సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

    ఈ నేపథ్యంలో, SIPB ఇప్పటికే ఆమోదించిన రూ.30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాల సృష్టికి సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ అనుకూలత తెలపనుంది.

    అంతేకాక, ఐటీ రంగానికి చెందిన సంస్థలకు తక్కువ ధరలకే భూములను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా

    ఆంధ్రప్రదేశ్

    Rain Alert: ఆంధ్రప్రదేశ్,తెలంగాణకు వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు వాతావరణ శాఖ
    Andhra News: ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ పాలసీ 2024-29 విడుదల: లక్ష్యంగా 20,000 కొత్త స్టార్టప్‌లు,లక్ష మందికి ఉపాధి  భారతదేశం
    GNU: ఉత్తారంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్శిటీ క్యాంపస్ ఏర్పాటు.. నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు భారతదేశం
    AP DSC Notificication: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025