Page Loader
CM Revanth Reddy: ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ

CM Revanth Reddy: ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2025
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రధానితో భేటీ కావడం ఇది మూడోసారి. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు జరుగుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం. ఈ భేటీలో హైదరాబాదు మెట్రో విస్తరణ,మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు,రీజనల్ రింగ్ రోడ్డు,ఫీచర్ సిటీకి కేంద్ర సహకారం అందించాలని రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. అదనంగా,బీసీ కుల గణన,ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానికి వివరించినట్లు తెలిసింది.

వివరాలు 

 రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం

అలాగే, రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ నిధులు సహా వివిధ రంగాలకు సంబంధించిన పలు అభ్యర్థనలను ప్రధాని మోదీకి సమర్పించారు. ఇంతేకాక, రేవంత్ రెడ్డి కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా, కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రితో కలిసి ఢిల్లీకి వెళ్లినవారిలో సీఎస్ శాంత కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి నాయుడు, డీజీపీ జితేందర్ కూడా ఉన్నారు.