NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana News: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. తొలి రాష్ట్రంగా ఘనత
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana News: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. తొలి రాష్ట్రంగా ఘనత
    ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి

    Telangana News: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. తొలి రాష్ట్రంగా ఘనత

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రఖ్యాత ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ రాష్ట్రం తనదైన ప్రత్యేకతతో సిద్ధమై, తన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది.

    కిటాక్యూషు నుండి ఒసాకాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన "తెలంగాణ రైజింగ్" ప్రతినిధి బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్‌లో అడుగుపెట్టింది.

    భారత పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన "తెలంగాణ జోన్"ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి అధికారికంగా ప్రారంభించారు.

    వివరాలు 

    ఒసాకా ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి భారతీయ రాష్ట్రం 

    ఒసాకా ఎక్స్‌పో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.

    ఈ ప్రతిష్ఠాత్మక వేదికలో పాల్గొనడం ద్వారా తెలంగాణ రాష్ట్రం, భారత్ తరఫున తొలి రాష్ట్రంగా నిలిచిన ఘనతను సొంతం చేసుకుంది.

    ఈ ఎక్స్‌పో వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రం తన అనేక వైవిధ్యభరితమైన ప్రత్యేకతలను - సంపన్న సాంస్కృతిక చరిత్రను, వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక వాతావరణాన్ని, సంప్రదాయ కళల నైపుణ్యాన్ని, అలాగే ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలను - ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు వివరించబోతోంది.

    వివరాలు 

    పెవిలియన్‌లోని ప్రదర్శనలు - టెక్నాలజీ, సంస్కృతి, పర్యాటకం 

    తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్రం సాధించిన సాంకేతిక పురోగతిని, సాంస్కృతిక వారసత్వాన్ని, అలాగే పర్యాటక రంగంలో ఉన్న వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా అనేక ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

    ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి, అలాగే ఇతర దేశాలతో సాంస్కృతిక, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు నూతన అవకాశాలను సృష్టిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    రేవంత్ రెడ్డి

    Hyd: నూతన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన భారతదేశం
    Delhi Election 2025: నేడు దిల్లీలో తెలుగు సీఎంల పర్యటన.. ఎందుకంటే? చంద్రబాబు నాయుడు
    Revanthreddy: తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన తెలంగాణ
    Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ! తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025