NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: రాబోయే ఐదేళ్లలో ఏడు కొత్త గనుల్లో బొగ్గు ఉత్పత్తి.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర బొగ్గుశాఖ
    తదుపరి వార్తా కథనం
    Telangana: రాబోయే ఐదేళ్లలో ఏడు కొత్త గనుల్లో బొగ్గు ఉత్పత్తి.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర బొగ్గుశాఖ
    రాబోయే ఐదేళ్లలో ఏడు కొత్త గనుల్లో బొగ్గు ఉత్పత్తి.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర బొగ్గుశాఖ

    Telangana: రాబోయే ఐదేళ్లలో ఏడు కొత్త గనుల్లో బొగ్గు ఉత్పత్తి.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర బొగ్గుశాఖ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 02, 2024
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాబోయే ఐదేళ్లలో సింగరేణి సంస్థ ఏడు కొత్త గనులను ప్రారంభించి, బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర బొగ్గుశాఖ తాజాగా వెల్లడించింది.

    దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో బొగ్గు ఉత్పత్తి పెరుగుదలపై ఆ శాఖ తాజా నివేదికను పార్లమెంటుకు అందజేసింది.

    ఆ నివేదిక ప్రకారం, సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి అధికంగా పెరిగినట్లు కాదు.

    2021-22లో 67.23 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసిన సింగరేణి, 2023-24లో 72.52 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది.

    ఈ సమయంలో 7.86% వృద్ధి నమోదు అయినప్పటికీ, ఒడిశాలో 29.41% వృద్ధి నమోదవడం గమనార్హం.

    ఛత్తీస్‌గఢ్‌లో రికార్డు స్థాయిలో 34.47% వృద్ధి నమోదు చేయగా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ముందడుగులో నిలిచాయి.

    వివరాలు 

    కొత్త గనులను త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు

    సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గిన కారణాలుగా, కార్మిక సంఘాలు పలు అంశాలను పేర్కొన్నాయి.

    ముఖ్యంగా, కేంద్రం గత ఐదేళ్లుగా నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని కోరినా స్పందించకపోవడం, భూగర్భ గనుల్లో కార్మికుల, యంత్రాల పూర్ణ పనితీరు లేకపోవడం, అధిక వర్షాలతో ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలున్నాయని తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో,సింగరేణి సంస్థ కొత్త గనులను త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

    కొత్తగా ప్రారంభించే గనుల ద్వారా 100లక్షల టన్నులు,40లక్షల టన్నులు, 20 లక్షల టన్నులు, 35 లక్షల టన్నులు అదనంగా ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

    కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్ రెడ్డి, సింగరేణి కార్మిక సంఘాలు, అధికారులు మరిన్ని కొత్త గనులను కేటాయించేందుకు విజ్ఞప్తి చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి

    తెలంగాణ

    Paddy Procurement: మిల్లుల కేటాయింపులో ఆలస్యం, ఇతర పరిణామాల ప్రభావం.. ఆలస్యంగా ధాన్యం కొనుగోళ్లు..  భారతదేశం
    CM Revanth Reddy: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో సమావేశం  రేవంత్ రెడ్డి
    Revanth Reddy: ఆర్టీసీ ప్రయాణం మరింత సౌకర్యవంతం.. త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు రేవంత్ రెడ్డి
    Telangana High Court: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు రిజర్వు హైకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025