NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు.. విపక్షాల భేటీలో ఖర్గే కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు.. విపక్షాల భేటీలో ఖర్గే కీలక వ్యాఖ్యలు
    ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు.. విపక్షాల భేటీలో ఖర్గే కీలక వ్యాఖ్యలు

    ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు.. విపక్షాల భేటీలో ఖర్గే కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 18, 2023
    04:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదని బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.

    కాంగ్రెస్ కు అధికారంపైనా, ప్రధాని మంత్రి పదవి పైనా ఆసక్తి లేదని, కేవలం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం , సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమని చెప్పారు.

    వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

    రాష్ట్రస్థాయిలో కొన్ని విభేదాలున్న మాట వాస్తవమేనని, కానీ అవి సిద్ధాంతపరమైన కావని, దేశం కోసం ఎదుర్కొంటున్న సమస్యలు ముందు ఇవి పెద్ద విషయాలు కావని మల్లికార్జున ఖర్గే చెప్పారు.

    Detaiils

    సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకమైన నిర్ణయాలు

    11 రాష్ట్రాల్లో తమ పార్టీలు అధికారంలోకి ఉన్నాయని, ఈ దఫా బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించలేదని పేర్కొన్నారు. బీజేపీ ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి పనిచేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని భాజపా వదిలేస్తుందని ఆయన ఆరోపించారు.

    కర్ణాటకలోని బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం సమావేశమైన విషయం తెలిసిందే. అయితే రెండో రోజైన మంగళవారం కూడా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది.

    సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు ఈ సమావేశంలో వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకున్నారు.

    ఈ సమావేశంపై స్పందించిన ప్రధాని మోదీ సొంత ప్రయోజనాల కోసం కొందరు ఏకమయ్యారని, అది అవినీతిపరుల సదస్సు అని విమర్శలు గుప్పించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లికార్జున ఖర్గే
    కాంగ్రెస్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    మల్లికార్జున ఖర్గే

    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీ
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీ
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    కాంగ్రెస్

    బ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    కన్నడిగులకు సిద్ధరామయ్య సర్కార్ శుభవార్త.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కర్ణాటక
    సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి భారతదేశం
    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025