బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఫిర్యాదు; ఎఫ్ఐఆర్ నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
రాహుల్ గాంధీని 'ఎగతాళి' చేశారంటూ బీజేపీ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు బెంగళూరులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
రాహుల్ గాంధీని ఎగతాళి చేస్తూ మాల్వియా ట్వీట్ చేసిన యానిమేషన్ వీడియోపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ మేరకు బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత రమేష్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మాల్వియా ఇటీవల రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై ట్విట్టర్లో ఒక వీడియోను విడుదల చేసారు. రాహుల్ భారతీయ వ్యతిరేకిగా ప్రవర్తిస్తున్నట్లు ఆ ట్విట్లో పేర్కొన్నారు.
అమిత్ మాల్వియాపై మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకుడు పవన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్
రాజకీయ కోణంలోనే ఈ కేసును నమోదు: తేజస్వీ సూర్య
కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ, న్యాయపరమైన అభిప్రాయం కోరిన తర్వాత పార్టీ ఈ ఫిర్యాదును నమోదు చేసినట్లు చెప్పారు. అది తప్పుడు ఉద్దేశ్యంతో నమోదు చేసినట్లు వారు భావిస్తే చట్టపరంగా ఎదుర్కోవాలని ఖర్గే పేర్కొన్నారు.
ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. రాజకీయ కోణంలోనే ఈ కేసును నమోదు చేసినట్లు చెప్పారు.
అమిత్ మాల్వియాపై ఐపీసీ 153ఏ, 505(2) కింద కేసు నమోదైందని సూర్య వెల్లడించారు.
ఈ రెండు సెక్షలు సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అయితే ఈ కేసులో రాహుల్ గాంధీ ఒక్కరు మాత్రమే ఉన్నారని సూర్య చెప్పారు. దీనిపై తాము కోర్టులో తేల్చుకుంటామని వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాహుల్ గాంధీపై అమిత్ మాల్వియా చేసిన ట్వీట్
Rahul Gandhi is dangerous and playing an insidious game… pic.twitter.com/wYuZijUFAu
— Amit Malviya (@amitmalviya) June 17, 2023
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాల్వియాపై ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలు
#WATCH | Whenever BJP bears the burnt of law, they cry. They have a problem following the law of the land. I want to ask the BJP that which part of the FIR has been filed with a mala fide intention. We have done it after taking legal opinion: Karnataka Minister Priyank Kharge on… pic.twitter.com/OGtVsjrl6O
— ANI (@ANI) June 28, 2023