NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!
    దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!

    Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 08, 2025
    02:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో కోవిడ్‌ మహమ్మారి మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది.

    తాజాగా వెలువడిన కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 6,133కు చేరింది.

    జూన్‌ 8న ఉదయం 8 గంటల వరకు నమోదైన డేటా ప్రకారం, గత 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదవగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

    ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 65కు చేరింది.

    Details

    కేరళలో అత్యధిక కేసులు 

    రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలోనే అత్యధికంగా 1,950 యాక్టివ్‌ కేసులున్నాయి.

    ఈ రాష్ట్రం తర్వాత గుజరాత్‌లో 822, పశ్చిమ బెంగాల్‌లో 693, దిల్లీలో 686 కేసులు ఉన్నాయి.

    మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366, ఉత్తరప్రదేశ్‌లో 219, తమిళనాడులో 194, రాజస్థాన్‌లో 132, హరియాణాలో 102 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి.

    Details

    ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంది 

    ఆంధ్రప్రదేశ్‌లో 86, బిహార్‌లో 49, ఛత్తీస్‌గఢ్‌లో 41, మధ్యప్రదేశ్‌లో 39, పంజాబ్‌లో 35, ఒడిశాలో 33, సిక్కింలో 23, పుదుచ్చేరిలో 15, తెలంగాణలో 10 కేసులున్నాయి.

    అలాగే జమ్మూ కశ్మీర్‌, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒక్కో రాష్ట్రంలో తొమ్మిది చొప్పున కేసులు ఉన్నాయి.

    ఇక అస్సాంలో 6, ఝార్ఖండ్‌లో 4, హిమాచల్ ప్రదేశ్‌లో 3, చండీగఢ్‌లో 2, త్రిపురాలో ఒక్క కేసు నమోదైంది.

    అరుణాచల్ ప్రదేశ్‌, మిజోరాంలలో ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

    Details

     ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

    మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచడం, గుంపులు గుమిగూడే ప్రాంతాల్లో ఉండకపోవడం వంటి మౌలిక జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    కేరళ
    భారతదేశం

    తాజా

    Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి! కోవిడ్
    Starlink Kit: స్టార్‌లింక్‌ సర్వీస్‌కు ముందు భారీ ఖర్చు.. కిట్ ధర ఎంతంటే? స్టార్‌లింక్‌
    Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే? గూగుల్
    Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్

    కోవిడ్

    Wuhan Lab: వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత  వుహాన్ ల్యాబ్
    అమెరికాను మళ్లి కలవరపెడుతున్న కరోనా; పెరుగుతున్న ఆస్పత్రిలో చేరికలు, సీడీసీ హెచ్చరిక  అమెరికా
    వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్: జాగ్రత్తగా ఉండాలంటున్న WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ
    జిల్ బైడెన్‌ కరోనా పాజిటివ్.. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు వస్తారా?  అమెరికా

    కేరళ

    BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు! కేంద్ర ప్రభుత్వం
    Kerala: కేరళలో రోడ్డు ప్రమాదం.. నవదంపతులతో సహా నలుగురు మృతి రోడ్డు ప్రమాదం
    Fire Accident: బోగీలలో మంటలు... నిలిచిపోయిన అలప్పుళ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం
    Kerala: కేరళలో న్యూక్లియర్‌ పవర్‌స్టేషన్‌ ఏర్పాటు! భారతదేశం

    భారతదేశం

    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ పాకిస్థాన్
    Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు  జమ్ముకశ్మీర్
    Operation Sindoor: డ్రోన్ దాడుల‌కు కౌంటర్‌ అటాక్.. పాక్‌ ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు పాకిస్థాన్
    India Pak War : భారత్‌లో 32 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025