
#NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?
ఈ వార్తాకథనం ఏంటి
కోవిడ్ మహమ్మారి సృష్టించిన నరక యాత్రను ఐదేళ్ల కిందట ఎవరూ మర్చిపోలేరు. ఆ పరిస్థితులు గుర్తొస్తే మన వెన్నులోనూ వణుకు కలుగుతుంది.
ప్రపంచమంతా ఈ మహమ్మారితో రణవైద్యంగా ఎదుర్కొంది. లక్షలాది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందారు.
ఏ హాస్పిటల్ ను చూస్తే, అక్కడ కరోనా పేషెంట్లే ఎక్కువగా కనిపించారు. బెడ్లు, ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాల కోల్పోయారు.
కోవిడ్ ఎన్నో కుటుంబాలకు బాధ, కన్నీళ్లు, వేదనను మిగిల్చింది. మూడు సంవత్సరాల విరామం తర్వాత దేశంలో కోవిడ్ కేసులు పునఃప్రవేశం చేసి టెన్షన్ పెడుతున్నాయి.
రోజువారీ కేసులు 250కి పైగా నమోదవుతున్నాయి. ఈ వ్యాధి తెలుగు రాష్ట్రాల్లో తిరిగి కలకలం రేపుతోంది.
Details
తెలంగాణలో కూడా కోవిడ్ కేసు
తెలంగాణలో కూడా ఈ కలకలం స్పష్టమైంది. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో ఓ డాక్టర్కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
రెండు రోజుల పాటు జ్వరంతో బాధపడిన ఆయన ఆర్టిపిసిఆర్ పరీక్షలో పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉన్నారు.
ఆయన కుటుంబ సభ్యులకూ కరోనా పరీక్షలు చేయించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెప్పినప్పటికీ, మాస్కులు తప్పక ధరిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు.
Details
వ్యక్తిగత శుభ్రత పాటించాలి
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి కరోనా కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా 35 బెడ్లు కలిగిన ప్రత్యేక COVID వార్డును ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో సుమారు 60 శాతం కరోనా కారణంగానే ఉన్నట్టు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
దగ్గు, జలుబు వంటి లక్షణాలున్నవారు తక్షణం వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. ప్రజలు భయపడకుండా ఉండాలని, స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని ఆసుపత్రి అధికారులు చెప్పుతున్నారు.
అయితే వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షిత చర్యలను పాటించడం మితిమీరకుండా చేయాలనీ చెప్పారు.
ప్రస్తుతం ఉన్న వేరియంట్ మైల్డ్ లక్షణాలతో ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు సాంత్వన ఇస్తున్నారు.
Details
కడపలో 75ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్
ఏపీ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి. విశాఖపట్నంలో తాజాగా ఒక కేసు నమోదయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కడపలోనూ 75 ఏళ్ల మహిళ కరోనా పాజిటివ్గా గుర్తించారు.
విశాఖ జిల్లాలో 23 ఏళ్ల యువతి పాజిటివ్గా గుర్తించారు. ఈ కేసులపై కడప, విశాఖ వైద్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసి, కరోనా నివారణ చర్యల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
సామాజిక, ప్రార్థనా కార్యక్రమాలను వాయిదా వేయాలని, ప్రజాసమూహాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరిస్తూ ఉండాలని పేర్కొన్నారు.
జ్వరం, దగ్గు, అలసట, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Details
అందుబాటులో పీపీఈ కిట్స్
విమ్స్, కేజీహెచ్ వంటి ఆసుపత్రుల్లో ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేసి, PPE కిట్స్, మందులు అందుబాటులో ఉంచారు. కరోనా విజృంభణను అరికట్టడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు వైద్య అధికారులు తెలిపారు.
విశాఖలో కేసుల పెరుగుదలతో కాకినాడ జీజీహెచ్ 24 బెడ్లతో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేసింది. వైద్యులు ప్రజలకు కరోనా వ్యాప్తి నివారణ కోసం మాస్కులు తప్పనిసరిగా ధరించవలసిన సూచనలు చేశారు.
ప్రయాణాలు, జనసమూహాల్లో మాస్కులు తప్పక వాడాలని, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలని సూచించారు.
అనుమానిత లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
Details
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
కరోనా 4 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని షేక్ చేసినప్పటికీ ప్రస్తుతం దాని వ్యాప్తి ఆసియా దేశాల్లో మళ్లీ పెరుగుతోంది.
ఇండియాలో 250కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నా, పెద్ద ఆందోళన అవసరం లేదని వైద్యులు, అధికారులు అంటున్నారు.
కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. కేరళ గతంలో వంటి మొదటి స్థానంలో ఉంది. కేరళ ఆరోగ్య మంత్రి ప్రజలను అప్రమత్తంగా ఉండమని, వైరస్ విస్తరణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరించారు.
పాండిచ్చేరి, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, హర్యానా, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు కూడా అలర్ట్ స్థితిలో ఉన్నాయి.
ప్రజలు జాగ్రత్తగా ఉండి, పాఠం నేర్చుకుని కోవిడ్ వ్యాప్తిని ఆపేందుకు తమపాలు అందించాలని వైద్య శాఖలు పిలుపునిచ్చాయి.