NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sitaram Yechury: సీతారాం ఏచూరికి కాకినాడతో అనుబంధం.. గతంలో కాకినాడ లైబ్రరీకి రూ.10 లక్షల సాయం 
    తదుపరి వార్తా కథనం
    Sitaram Yechury: సీతారాం ఏచూరికి కాకినాడతో అనుబంధం.. గతంలో కాకినాడ లైబ్రరీకి రూ.10 లక్షల సాయం 
    కాకినాడ లైబ్రరీకి రూ.10 లక్షల సాయం

    Sitaram Yechury: సీతారాం ఏచూరికి కాకినాడతో అనుబంధం.. గతంలో కాకినాడ లైబ్రరీకి రూ.10 లక్షల సాయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 13, 2024
    01:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

    న్యుమోనియా తరహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో విపరీతంగా బాధపడుతున్న ఆయన, ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు.

    చికిత్స పొందుతూ, ఆక్సిజన్‌ సపోర్ట్ అందించినప్పటికీ పరిస్థితి మెరుగు కాకపోవడం వల్ల, గురువారం మధ్యాహ్నం 3:03 గంటలకు తుదిశ్వాస విడిచారు.

    కుటుంబసభ్యులు ఆయన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధన కోసం ఎయిమ్స్‌కు దానం చేయాలని నిర్ణయించుకున్నారు.

    వివరాలు 

    కాకినాడ రామారావుపేటలో "ఏచూరి టవర్స్"

    సీతారాం ఏచూరికి కాకినాడతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన తల్లిదండ్రులు కాకినాడకు చెందిన వారు.

    కానీ ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఉద్యోగ విరమణ తర్వాత కాకినాడలో స్థిరపడ్డారు.

    సోమయాజులు కాకినాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీతారాం ఆయనకు సేవలు చేశారు.

    కానీ సోమయాజులు 1999 అక్టోబర్ 11న మృతిచెందారు. కాకినాడ రామారావుపేటలో "ఏచూరి టవర్స్" అనే భవనం సమీపంలో మరో నివాసం ఉండేది.

    మూడు సంవత్సరాల క్రితం వరకు సీతారాం తల్లి అక్కడే నివసించేవారు, కానీ ఆమె ఆరోగ్యం క్షీణించిన తరువాత ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆమె 2021 సెప్టెంబర్‌లో మరణించారు.

    వివరాలు 

    ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు సాయం

    సీతారాం ఏచూరి తల్లి కల్పకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్‌ కందాకు సోదరి.

    కల్పకం దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ శిష్యురాలిగా ప్రసిద్ధి చెందారు. కాకినాడలో ఆలిండియా ఉమెన్‌ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించి మహిళా అభ్యున్నతి కోసం కృషి చేశారు.

    సీతారాం ఏచూరి కాకినాడకు ఉన్న అనుబంధంతో, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సమయంలో కాకినాడ గాంధీభవన్‌లో గ్రంథాలయం నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు సాయం అందించారు.

    సీతారాం ఏచూరి విద్యార్థి నాయకుడిగా సీపీఎం పార్టీలో తన ప్రస్థానం ప్రారంభించారు.ఆ తర్వాత వివిధ స్థాయిల్లో ఎదిగారు.

    సీపీఎం జాతీయ నాయకత్వంలో ఉన్నప్పటికీ,తెలుగు రాష్ట్రాల్లో కీలక సమావేశాలకు హాజరయ్యారు.

    ఆయన పుచ్చలపల్లి సుందరయ్య తరువాత సీపీఎంకు నాయకత్వం వహించిన రెండవ తెలుగువారిగా పేరుపొందారు.

    వివరాలు 

    పదవిలో ఉండగానే తుదిశ్వాస విడిచిన తొలి నాయకుడు

    అయితే ఆయన ఆ పదవిలో ఉండగానే తుదిశ్వాస విడిచిన తొలి నాయకుడిగా మిగిలారు.

    సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఆర్టీసీలో ఇంజినీర్‌గా పనిచేశారు, తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి.

    ఆయన బాల్యం హైదరాబాద్‌లో గడిచింది. అబిడ్స్‌లోని ఆల్‌సెయింట్స్ పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, నిజాం కళాశాలలో పీయూసీ పూర్తి చేశారు.

    అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లి, అక్కడి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాకినాడ సిటీ

    తాజా

    Olympic Games-BCCI: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు అండగా  కేంద్ర క్రీడా శాఖ.. బీసీసీఐ,కార్పొరేట్‌ సంస్థల మద్దతు  బీసీసీఐ
    Miss World 2025: ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. 'ఇక్కత్‌' వస్త్రాల ప్రాంగణంలో 'ప్రపంచ సుందరి' పోటీదారుల సందడి  తెలంగాణ
    Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్ లక్నో సూపర్‌జెయింట్స్
    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్ పాకిస్థాన్

    కాకినాడ సిటీ

    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025