NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Amaravati: అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానం
    అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానం

    Amaravati: అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 02, 2025
    09:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై దృష్టిసారిస్తూ కీలక భవనాల నిర్మాణానికి మరో ముందడుగు వేసింది. శాశ్వత హైకోర్టు, శాసనసభ భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది.

    శాసనసభ భవన నిర్మాణానికి రూ.768 కోట్ల అంచనా వేసి, హైకోర్టు భవన నిర్మాణానికి రూ.1,048 కోట్ల వ్యయంతో శనివారం బిడ్లు పిలిచారు.

    టెండర్ల దాఖలుకు మార్చి 17 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించగా, అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్లు తెరవనున్నారు.

    అనంతరం ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం అర్హత పొందిన ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు.

    Details

    103 ఎకరాల్లో అసెంబ్లీ భవనం 

    అసెంబ్లీ భవనం అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ 'ఈ'లో నిర్మించనున్నారు. ఈ భవనం 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనుంది.

    బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మూడు అంతస్తులతో ప్రత్యేక శైలిలో దీన్ని డిజైన్ చేశారు. లండన్‌కు చెందిన ఫోస్టర్స్ సంస్థ ఈ భవనానికి డిజైన్ అందించింది.

    భవనానికి పైభాగంలో శిఖరం ఆకారంలో ప్రత్యేకమైన ఆకృతి ఉంటుందనే, దాని నుంచి అమరావతి నగరాన్ని చూడేలా ప్రణాళిక రూపొందించారు.

    2018లో టీడీపీ ప్రభుత్వం శాసనసభ భవన నిర్మాణానికి రూ.555 కోట్ల అంచనా వేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడంతో వ్యయం పెరిగి రూ.768 కోట్లకు చేరింది.

    Details

    రెండో అంతస్తులో కౌన్సిల్ హాళ్లు, శిక్షణ కేంద్రాలు

    ఈ భవనంలో మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు, అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాల్, క్యాంటీన్లు, సెంట్రల్ హాల్, లైబ్రరీ వంటివి ఏర్పాటు చేయనున్నారు.

    రెండో అంతస్తులో కమిటీల ఛాంబర్లు, సభ్యుల లాంజ్, అసెంబ్లీ, కౌన్సిల్ హాళ్లు, శిక్షణ కేంద్రం ఉండనున్నాయి.

    మూడో అంతస్తును నగర వీక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

    Details

    శాశ్వత హైకోర్టు డిజైన్ 

    హైకోర్టు భవనాన్ని అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ 'ఎఫ్'లో నిర్మించనున్నారు. ఇది మొత్తం 42.36 ఎకరాల్లో, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతుంది.

    బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు ఏడు అంతస్తులతో దీన్ని డిజైన్ చేశారు. ఏడో అంతస్తులో కోర్టు సమావేశ మందిరం, డైనింగ్ హాల్, సువిశాల గ్రంథాలయం ఏర్పాటుకానున్నాయి.

    2019 ఫిబ్రవరి 3న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చేతుల మీదుగా ఈ భవనానికి శంకుస్థాపన జరిగింది.

    మొదట్లో నిర్మాణ వ్యయం రూ.860 కోట్లుగా అంచనా వేయగా, ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోయాయి. తాజా అంచనా ప్రకారం, ఈ హైకోర్టు భవనం నిర్మాణానికి వ్యయం రూ.1,048 కోట్లకు చేరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    హైకోర్టు

    తాజా

    Corona Virus: కరోనా డేంజర్‌ బెల్స్‌..4866కి పెరిగిన యాక్టివ్ కోవిడ్-19 కేసులు.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి కరోనా కొత్త కేసులు
    Raviteja : పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రవితేజ,కిషోర్ తిరుమల మూవీ  రవితేజ
    Sachin Tendulkar: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. సంతాపం వ్యక్తం చేసిన స‌చిన్‌ సచిన్ టెండూల్కర్
    Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా? బెంగళూరు

    అమరావతి

    అమరావతి రైతులకు ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు.. వైసీపీని తుక్కుగా ఓడించాలని పిలుపు ఆంధ్రప్రదేశ్
    Chandrababu Naidu: ఎన్డీయే కూటమిలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    అమరావతి రింగ్‌ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్ నారా లోకేశ్
    Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట.. అప్పటి వరకు అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు చంద్రబాబు నాయుడు

    హైకోర్టు

    Himachal Pradesh: అనర్హత వేటుపై హైకోర్టుకు ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు  హిమాచల్ ప్రదేశ్
    Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు  నాగపూర్
    రాజకీయాల్లోకి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి.. బీజేపీలో చేరిక బీజేపీ
    AP High Court: గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025