NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి
    ఎఫ్‌బీయూ స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు ఎంహెచ్ఏ అనుమతి

    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి

    వ్రాసిన వారు Stalin
    Feb 22, 2023
    10:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫీడ్‌బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అనుమతిని ఇచ్చింది.

    స్నూపింగ్ కేసులో సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని గతంలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సీబీఐ కోరగా, ఆయన దానని కేంద్ర హోం శాఖకు పంపారు. తాజాగా కేంద్రం విచారణకు ఆమోదం తెలిపింది.

    దిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియాకు కేంద్రం తాజా నిర్ణయం ఎదురుదెబ్బే అని చెప్పాలి. అయితే సిసోడియా మాత్రం ఫీడ్‌బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

    సిసోడియా

    ఫీడ్‌బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసు ఏంటి? సీబీఐ నివేదకలో ఏముంది?

    2015లో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ గూఢచర్యానికి పాల్పడినట్లు సీబీఐ తన నివేదికలో ఆరోపించింది. ఇందుకోసం దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆధ్వర్యంలో పొలిటికల్ ఇంటెలిజెన్స్ సేకరణ కోసం 'ఫీడ్‌బ్యాక్ యూనిట్'ను ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు సీబీఐ పేర్కొంది.

    సెప్టెంబరు 29, 2015 నాటి క్యాబినెట్ నిర్ణయం ద్వారా 'ఫీడ్‌బ్యాక్ యూనిట్' ఏర్పడిందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. సిసోడియా నేతృత్వంలోని ఏర్పాటైన ఈ యూనిట్‌కు శాసన లేదా న్యాయపరమైన చట్టబద్ధత లేదని చెప్పింది. అయితే రాజకీయ నాయకులపై నిఘా ఉంచిందని అభియోగాలు మోపింది. 'ఫీడ్‌బ్యాక్ యూనిట్' ఏర్పాటుకు సంబంధించి ఎల్‌జీ అనుమతి కూడా తీసుకోలేదని సీబీఐ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    హోంశాఖ మంత్రి
    సీబీఐ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దిల్లీ

    రాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్ భారతదేశం
    దిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కు వేధింపులు, కారు అద్దంలో చేయి ఇరుక్కున్నా ఈడ్చుకెళ్లిన డ్రైవర్ భారతదేశం
    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం గణతంత్ర దినోత్సవం
    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ ఎయిర్ ఇండియా

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు అరవింద్ కేజ్రీవాల్
    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ

    హోంశాఖ మంత్రి

    చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం ఆంధ్రప్రదేశ్
    దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025