NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Odd-Even : దిల్లీలో కాలుష్యం కోరలు.. 'సరి-బేసి' విధానం ఎప్పట్నుంచి అమలు చేయనున్నారంటే..
    తదుపరి వార్తా కథనం
    Delhi Odd-Even : దిల్లీలో కాలుష్యం కోరలు.. 'సరి-బేసి' విధానం ఎప్పట్నుంచి అమలు చేయనున్నారంటే..
    సరి-బేసి' విధానం ఎప్పట్నుంచి అమలు చేయనున్నారంటే..

    Delhi Odd-Even : దిల్లీలో కాలుష్యం కోరలు.. 'సరి-బేసి' విధానం ఎప్పట్నుంచి అమలు చేయనున్నారంటే..

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 06, 2023
    05:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. ఈ మేరకు దాన్ని నియంత్రించేందుకు దిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది.

    ఇందులో భాగంగానే 'సరి-బేసి' విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలోనే స్కూళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

    దీపావళి పండుగ తర్వాతి రోజు నుంచి మళ్లీ 'సరి-బేసి (Odd even scheme)' విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నామని దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు.

    నవంబరు 13 నుంచి 20 వరకు ఈ విధానం అమల్లో ఉంటుందన్నారు. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు చివరన సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజున రోడ్డెక్కాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నగరంలో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టనుంది.

    DETAILS

    BS-3 పెట్రోల్‌, BS-4 డీజిల్‌ వాహనాలపై నిషేధం

    దిల్లీలో కాలుష్యం హెచ్చు స్థాయికి చేరడంతో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సరి-బేసిపై నిర్ణయం తీసుకున్నారు.

    ఇదే సమయంలో పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 10, 12వ తరగతుల వారిని మినహాయించి మిగతా అన్ని తరగతుల వారికి నవంబరు 11 వరకు సెలవులను ప్రకటించామని దిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్‌ చెప్పారు.

    ఇప్పటివరకు కేవలం ప్రాథమిక స్కూళ్లను మాత్రమే ప్రకటించగా, తాజాగా ఉన్నత పాఠశాలలనూ మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో రహదారులు, వంతెనల వంటి నిర్మాణాలను సైతం ఆపేస్తున్నామన్నారు.

    BS-3 పెట్రోల్‌, BS-4 డీజిల్‌ వాహనాలపై నిషేధం కొనసాగుతుందన్నారు.అత్యవసర వస్తువులను సరఫరా చేసే ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ ట్రక్కులకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    వాయు కాలుష్యం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    దిల్లీ

    News Click: చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చైనా
    '40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం  కెనడా
    Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు  భూకంపం
    Delhi : ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్  ఉగ్రవాదులు

    వాయు కాలుష్యం

    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు హైదరాబాద్
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని  దిల్లీ
    Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు దిల్లీ
    Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025