
E-auction of gifts: ప్రధాని మోదీ బహుమతుల వేలం ప్రారంభం.. రామాలయ నమూనా, భవానీ దేవత విగ్రహం సహా 1,300 వస్తువులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు గతంలో అందించిన బహుమతులపై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఇ-వేలం సెప్టెంబర్ 17 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఇది మోదీకి సంబంధించిన బహుమతుల వేలానికి ఏడవ సంచికగా నిర్వహించడం విశేషం. ఈ వేలం ద్వారా సేకరించబడే మొత్తం ఆదాయాన్ని 'నమామి గంగే' ప్రాజెక్ట్ కోసం వినియోగించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. వేలం అక్టోబర్ 2 తేదీ వరకు కొనసాగనుంది.ఈ వర్చువల్ వేలంలో మొత్తం 1,300కి పైగా ప్రత్యేక ప్రదర్శన వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఈ వేలంలో ప్రధానంగా కొన్ని అపూర్వమైన ప్రదర్శన వస్తువులు ఉన్నాయి.
వివరాలు
వేలంలో పాల్గొనాలనుకునే వారు..
అందులో ప్రధానంగా రామ మందిర నమూనా.. కనీస ధర ₹5.5 లక్షలు, భవానీ దేవి విగ్రహం.. కనీస ధర ₹1.03 కోట్లు, పారాలింపిక్స్ క్రీడాకారుల బూట్లు.. ఒక్క జత ధర ₹7.7 లక్షలు ఉన్నాయి. ఇతర ప్రత్యేక కళారూపాల్లో జమ్ముకశ్మీర్ పష్మినా శాలువా, తంజావూరు రామ దర్బార్ చిత్రం, లోహంతో రూపొందించిన నటరాజ విగ్రహం, నాగాలాండ్ చేనేత శాలువాలు, గుజరాత్ రోగన్ కళాకృతి వంటి కళా వస్తువులు కూడా ఉన్నాయి. వేలంలో పాల్గొనాలనుకునే వారు www.pmmementos.gov.in వెబ్సైట్లోకి వెళ్లి తమ ఇష్టమైన వస్తువులకు బిడ్లు వేయొచ్చు.
వివరాలు
గంగా శుద్ధికి..
ఈ వేలం ద్వారా సేకరించిన మొత్తాన్ని గంగా నదిని శుద్ధి చేయడం, పరిరక్షించడం, పునరుజ్జీవనం చేయడం వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు వినియోగిస్తారు. 'నమామి గంగే' ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన పర్యావరణ సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటి. ఇప్పటివరకు ఈ ప్రత్యేకమైన ఆరు ఎడిషన్ల ద్వారా ₹50 కోట్లకు పైగా నిధులు సేకరించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ వేలం కేవలం చారిత్రక,అపూర్వమైన జ్ఞాపికలు సొంతం చేసుకోవడం మాత్రమే కాదు. ఇది దేశ సేవకు, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించే అవకాశంగా భావించాలి.
వివరాలు
గంగా శుద్ధికి..
ఈ ప్రక్రియ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత అభిరుచి తో పాటు దేశభక్తిని కూడా ప్రతిబింబించుకునే అవకాశాన్ని పొందుతున్నారు. ప్రదర్శన వస్తువులన్నీ ప్రస్తుతం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (NGMA), న్యూఢిల్లీ లో ప్రదర్శనకు ఉంచారు. ఈ వేలం ద్వారా గంగా నది పునరుజ్జీవన కార్యక్రమాలు మరింత వేగవంతం కావడమే కాకుండా, మోదీ ప్రభుత్వ సామాజిక బాధ్యతను బలంగా ప్రదర్శించేది. ప్రతి భారత పౌరుడు ఈ ప్రక్రియలో భాగస్వామిగా మారి, దేశం, పర్యావరణం కోసం మంచి కృషి చేయగలరని ఈ కార్యక్రమం సూచిస్తోంది. ఈ ప్రత్యేక వర్చువల్ వేలం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగనుంది.