NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఎన్నికల సంఘం
    తదుపరి వార్తా కథనం
    నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఎన్నికల సంఘం
    నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఎన్నికల సంఘం

    నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఎన్నికల సంఘం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2023
    10:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మిజోరం,ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,తెలంగాణ రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) నేడు ప్రకటించనుంది.

    పోలింగ్ తేదీలు, దశల సంఖ్య,నామినేషన్ల దాఖలు,ఉపసంహరణ తేదీలను ప్రకటించడానికి పోల్ ప్యానెల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

    ఈ ఐదు రాష్ట్రాల్లోని శాసన సభల పదవీకాలం డిసెంబర్ 2023,జనవరి 2024 మధ్య ముగుస్తుంది. ECI సాధారణంగా శాసనసభ గడువు ముగియడానికి ఆరు నుండి ఎనిమిది వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది.

    Details 

    2018లో  ఒకే దశలో ఎన్నికలు  

    రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి.

    రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బిజెపి అధికార పార్టీగా ఉంది. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉన్నాయి.

    అంతకుముందు, నవంబర్ రెండవ వారం,డిసెంబర్ మొదటి వారం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉందని EC తెలిపింది.

    రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలలో 2018లో చివరిసారిగా ఒకే దశలో ఎన్నికలు జరిగినట్లు EC వర్గాలు తెలిపాయి.

    Details 

    ఐదు రాష్ట్రాలకు వేర్వేరుగా పోలింగ్ తేదీలు 

    2018లో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు రెండు దశలలో జరిగింది. ఇప్పుడు అదే విధంగా రెండు దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని EC తెలిపింది.

    మొత్తం ఐదు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉండవచ్చు. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఒకే రోజు జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం

    తాజా

    Chandrababu: పార్టీకి చెడ్డపరు తెస్తే ఉపేక్షించం : సీఎం చంద్రబాబు హెచ్చరిక చంద్రబాబు నాయుడు
    Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత! విశాఖపట్టణం
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణ
    Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు! జీవనశైలి

    ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ భారతదేశం
    ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల తెలంగాణ
    తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025