NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ
    భారతదేశం

    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ

    వ్రాసిన వారు Naveen Stalin
    March 09, 2023 | 03:36 pm 0 నిమి చదవండి
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం తీహార్ జైలులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను రెండోసారి ప్రశ్నించింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చినం అంశాలపై ప్రధానంగా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. సాక్ష్యాలను లేకుండా చేయడం కోసం ఫోన్లను మార్చడం, హోల్‌సేలర్‌ల లాభాల మార్జిన్‌ను 5% నుంచి 12%కి పెంచడం వంటి అంశాలు, ఇందులో సౌత్ గ్రూప్ పాత్ర ఏంటి అనే కోణంలో సిసోడియాను విచారిస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు.

    శుక్రవారం కూడా మనీష్ సిసోడియాను విచారించే అవకాశం

    మనీష్ సిసోడియాను శుక్రవారం కూడా విచారించవచ్చని పేరు అధికారులు వెల్లడించారు. తాము ప్రస్తుతం పెద్ద కుట్ర, డబ్బు జాడపై దృష్టి పెడుతున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి పేర్కొన్నారు. ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా.. దిల్లీ కోర్టు సోమవారం మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత మార్చి 11న ఏజెన్సీ ఎదుట హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారమే దేశ రాజధానికి చేరుకున్నారు. తాను ఈడీ ఎదుట హాజరై వారికి సహరిస్తామని వెల్లడించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    మనీష్ సిసోడియా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ

    ఏ తప్పూ చేయలేదు, ఈడీ విచారణను ఎదుర్కొంటా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం లాలూ ప్రసాద్ యాదవ్
    హెచ్3ఎన్2 వైరస్ కూడా కరోనా తరహాలోనే వ్యాపిస్తుంది; ఎయిమ్స్ మాజీ చీఫ్ హెచ్చరిక కోవిడ్

    మనీష్ సిసోడియా

    దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ దిల్లీ
    మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా దిల్లీ
    జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు దిల్లీ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు లాలూ ప్రసాద్ యాదవ్
    రేపు కవిత విచారణ; ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై కల్వకుంట్ల కవిత
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023