NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Eknath Shinde: మహారాష్ట్ర మాజీ సీఎంకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
    తదుపరి వార్తా కథనం
    Eknath Shinde: మహారాష్ట్ర మాజీ సీఎంకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
    మహారాష్ట్ర మాజీ సీఎంకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

    Eknath Shinde: మహారాష్ట్ర మాజీ సీఎంకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 03, 2024
    01:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్యానికి గురయ్యారు.

    ఆయన ఆరోగ్యం ఊహించని విధంగా క్షీణించడం రాష్ట్ర రాజకీయాలలో ఉత్కంఠను పెంచింది.

    ఈ పరిణామాల నేపథ్యంలో, షిండేను థానేలోని జూపిటర్ హాస్పిటల్‌లో చేర్చారు.

    వైద్యులు ఆయనకు డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహించగా, వాటి ఫలితాలు నెగటివ్‌గా వచ్చాయి.

    అయితే, బాడీ వైట్ సెల్స్ తగ్గడం వల్ల చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. తీవ్రమైన జ్వరం కారణంగా ఆయన యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారు.

    వివరాలు 

    షిండే ఆరోగ్య పరిస్థితి ప్రమాణస్వీకారంపై ప్రభావం చూపుతుందా

    శివ సైనికులు షిండే అనారోగ్యం గురించి తెలుసుకుని హాస్పిటల్‌కు తరలి వెళ్లారు.

    ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మినిష్టర్ అమిత్ షా కూడా ఆయన ఆరోగ్యంపై సమాచారం తీసుకున్నారు.

    షిండే అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి జరగాల్సిన మహాయుతి సమావేశం వాయిదా పడింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సమావేశం రేపటికి పొడిగించబడింది.

    ఈ నెల 5న బీజేపీ నేత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర పెద్దలు ప్రకటించారు.

    అయితే షిండే ఆరోగ్య పరిస్థితి దీనిపై ప్రభావం చూపుతుందా? లేక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం యథావిధిగా జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

    వివరాలు 

     పొత్తు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం 

    మరోవైపు , హోం, స్పీకర్ పదవుల విషయంలో బీజేపీ పట్టువిడవడం లేదు. శివసేన, ఎన్సీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటంతో, అవసరమైతే బీజేపీకి ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్‌లతో పొత్తు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

    బీజేపీ ఇప్పటికే 132 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉంది. మరో 13 మంది చేరితే మ్యాజిక్ ఫిగర్ దాటడం సులభమవుతుంది.

    ఈ పరిణామాల మధ్య, షిండే అనారోగ్యం కారణంగా మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏక్‌నాథ్ షిండే

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఏక్‌నాథ్ షిండే

    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ శివసేన
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం శివసేన
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025