Page Loader
Election cmapiagn -Completed: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..144 సెక్షన్​ అమలు
ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్​ కుమార్

Election cmapiagn -Completed: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..144 సెక్షన్​ అమలు

వ్రాసిన వారు Stalin
May 11, 2024
06:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈమేరకు ఇరు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు వికాస్​ రాజ్​ (తెలంగాణ), ముఖేష్​ కుమార్​ (ఆంధ్రప్రదేశ్​) ప్రకటించారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత నియోజకవర్గాల్లోని స్థానికేతర నాయకులు, స్థానికేతరులు నియోజకవర్గాలనుంచి బయటకు వెళ్లిపోవాలని సూచించారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట ఈ విషయంపై మినహాయింపు ఉంటుందని వారు తెలిపారు. మే 13 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ ఉంటుందని వివరించారు. పోలింగ్​ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్స్​ పీరియడ్​ మొదలవుతుందని వారు తెలిపారు.

Election cmapiagn -Completed

తెలంగాణలో 144 సెక్షన్​ 

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్​ అమలువుతుందని వెల్లడించారు. టీవీ, రేడియో, సోషల్​ మీడియా ద్వారా ప్రచారం ముగిసిందని తెలిపారు. పత్రికల్లో ప్రకటనల కోసం ప్రీ సర్టిఫికేషన్​ తీసుకోవాలన్నారు. ఓటర్లు ఫోన్లు తెచ్చేందుకు కూడా అనుమతి లేదని తెలిపారు.