NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CEC: ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ విమర్శలు..కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    CEC: ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ విమర్శలు..కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు..
    ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ విమర్శలు..కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు..

    CEC: ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ విమర్శలు..కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 11, 2025
    05:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ పార్టీ చేసిన విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యమైన ప్రకటన చేసింది.

    భారతదేశంలో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత క్రమబద్ధమైనది, పారదర్శకమైన విధానాల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు.

    ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితాను పరిశీలించి సవరించే ప్రక్రియ నిష్ఠతో చేపట్టబడుతుందని, ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో ఉన్న జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఆ జాబితాలు అందజేయబడతాయని ఆయన స్పష్టం చేశారు.

    వివరాలు 

    జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు

    1960 సంవత్సరం నుండి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికల జాబితాలను పంచుకుంటూ వస్తున్నామని, పార్టీలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు లేదా అప్పీలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని సీఈసీ వెల్లడించారు.

    దేశవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న ఎన్నికలను సమర్థవంతంగా, నమ్మకంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం వద్ద ఉన్న బలమైన యంత్రాంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు.

    ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, భద్రతా సిబ్బంది, నిపుణులు,మీడియా నిరంతరం, సూటిగా పర్యవేక్షణ చేస్తూనే ఉంటారని తెలిపారు.

    ఈ విధంగా విస్తృతంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోగలుగుతున్నారని జ్ఞానేశ్ కుమార్ చెప్పారు.

    వివరాలు 

    ఎన్నికల నేపథ్యంలో తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ

    ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన కొన్ని ఎన్నికల నేపథ్యంలో తీవ్ర విమర్శలు చేశారు.

    కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం సాధించాల్సిన చోట భాజపా మ్యాచ్‌ ఫిక్సింగ్ ద్వారా గెలిచిందని ఆయన ఆరోపించారు.

    ఎన్నికల్లో నిజాయతీ లేనివ్వడమే కాకుండా, జాతీయ సంస్థలను తమ పట్టు లోపల ఉంచుకుని అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో, పోలింగ్ ముగిసే సమయానికి సాయంత్రం 5 గంటలకు 58.22 శాతం పోలింగ్ నమోదవగా, మరుసటి రోజే అది 66.05 శాతానికి పెరిగినదాన్ని ప్రశ్నిస్తూ ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం

    తాజా

    CEC: ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ విమర్శలు..కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం
    Mangli : మంగ్లీ పుట్టినరోజు వేడుకలు.. FIR కాపీలో సంచలన విషయాలు తెలంగాణ
    Kuberaa: 'ఆనంద్' నుంచి 'కుబేర' వరకు.. శేఖర్ కమ్ముల టాప్ 5 మూవీస్ చూశారా? అస్సలు మిస్ కావొద్దు!  టాలీవుడ్
    Thammudu: అక్కా తమ్ముడు అనుబంధం ఇతివృత్తంగా నితిన్‌ 'తమ్ముడు'.. ఆకట్టుకునేలా ట్రైలర్‌ నితిన్

    ఎన్నికల సంఘం

    Lok Sabha Elections 2024 :మూడో దశలో 65.68% ఓటింగ్.. 4రోజుల తర్వాత తుది పోలింగ్‌ను విడుదల చేసిన ఎన్నికల సంఘం  భారతదేశం
    Election cmapiagn -Completed: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..144 సెక్షన్​ అమలు తెలంగాణ
    AP Violence: మూడు రోజులైనా ఎపిలో ఆగని హింసపై సీఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీ ఢిల్లీ రావాలని ఆదేశాలు ఆంధ్రప్రదేశ్
    Palanadu: పల్నాడు జిల్లా కలెక్టరుగా లత్కర్ శ్రీకేష్ బాలాజీ.. ఈరోజే బాధ్యతలు చేపట్టాలన్న ఈసీ పల్నాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025